
దిల్లీ: ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ.5వేలు
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటన
లబ్ధిదారులందరికీ 2నెలల ఉచిత రేషన్
దిల్లీ: కరోనా విలయంతో అల్లాడుతోన్న దిల్లీలో లాక్డౌన్ ఆంక్షలు అమలుచేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఆంక్షలను మే 10వరకు పొడిగించినట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో పేదలు, బలహీనవర్గాలను ఆదుకునేందుకు ఆమ్ఆద్మీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా వచ్చే రెండు నెలలపాటు రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ ఉచిత రేషన్ అందిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. దీని ద్వారా దాదాపు 72 లక్షల కార్డుదారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఇలా ఇస్తున్నప్పటికీ రెండు నెలలు వరకు లాక్డౌన్ ఉండదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పేదలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ఆటో, టాక్సీ డ్రైవర్లకు 5వేలు..
లాక్డౌన్ వల్ల ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆటోరిక్షా, టాక్సీ డ్రైవర్లకు రూ.5వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెల్లడించారు. సంక్షోభ సమయంలో ఆర్థికంగా వారికి కొంత ఊరట కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. గతేడాది లాక్డౌన్ విధించిన సమయంలోనూ వీరికి దిల్లీ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. దీనివల్ల దాదాపు లక్షన్నర మంది ఆటో, టాక్సీ డ్రైవర్లు లబ్ధిపొందినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఇక దిల్లీలో లాక్డౌన్ విధించినప్పటికీ కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. సోమవారం ఒక్కరోజే 18వేల పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. రోజువారీ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ కొవిడ్ మరణాలు ఆందోళనకరంగా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 448 మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కరోనా మరణాల సంఖ్య 400 నమోదుకావడం వరుసగా ఇది మూడోరోజు కావడం ఆందోళనకర విషయం. ఇప్పటివరకు దిల్లీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 17వేలు దాటింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
PUSHPA: ‘తగ్గేదే లే’.. అంతకంతకూ పెరుగుతోన్న ‘పుష్ప’ క్రేజ్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Business News
Tax on Gold: బంగారం కొనుగోలుదారులకు షాక్.. దిగుమతి సుంకం పెంపు!
-
Business News
Tax on petrol diesel exports: పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై పన్ను
-
Crime News
MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ పొడిగింపు
-
Sports News
Jasprit Bumrah: అది అర్థమయ్యేసరికి బుమ్రాకు సమయం పట్టింది: సంజన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేత!
- Andhra News: రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..
- Andhra News: ‘ఉడత ఊపితే’ తీగలు తెగుతాయా!
- Income Tax Rules: జులై 1 నుంచి అమల్లోకి రాబోతున్న 3 పన్ను నియమాలు..
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!