White Fungus: దిల్లీ ఆసుపత్రిలో తొలి కేసు
మ్యూకర్మైకోసిస్ (బ్లాక్ఫంగస్) కేసులు విపరీతంగా పెరిగిపోతున్న వేళ.. ప్రమాదకరమైనదిగా భావిస్తోన్న క్యాండిడా (వైట్ ఫంగస్) కేసు దిల్లీ ఆసుపత్రిలో నమోదయ్యింది
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ.. ఫంగస్ ఇన్ఫెక్షన్ కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే మ్యూకర్మైకోసిస్ (బ్లాక్ఫంగస్) కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో ప్రమాదకరమైనదిగా భావిస్తోన్న క్యాండిడా (వైట్ ఫంగస్) కేసు దిల్లీ ఆసుపత్రిలో నమోదయ్యింది. కరోనా వైరస్ సోకిన బాధితురాలిలో ఈ ఇన్ఫెక్షన్ కారణంగా జీర్ణకోశంలో చిల్లులు పడినట్లు వైద్యులు గుర్తించారు. దిల్లీలో నమోదైన తొలి క్యాండిడా ఇన్ఫెక్షన్ కేసు కూడా ఇదేనని వైద్యులు వెల్లడించారు.
‘మే 13వ తేదీన తీవ్ర కడుపునొప్పితో వచ్చిన ఓ 49ఏళ్ల ఓ మహిళ ఆసుపత్రిలో చేరింది. వైద్య పరీక్షల్లో ఆమె ఆహార నాళికల్లో తీవ్ర ఇన్ఫెక్షన్ను గుర్తించాం. పలు సర్జరీలు నిర్వహించిన తర్వాత పేగు నమూనాలను తదుపరి పరీక్షలకు పంపించాం. అనంతరం ఆమెకు వైట్ ఫంగస్ వల్ల తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు నిర్ధారణకు వచ్చాం. క్యాండిడా (వైట్ ఫంగస్) ఇన్ఫెక్షన్ కారణంగా జీర్ణకోశంలోని పేగులు ఛిద్రమైనట్లు గుర్తించాం’ అని దిల్లీలోని సర్గంగారాం ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అనిల్ ఆరోరా తెలిపారు. ఇప్పటికే ఆ మహిళకు రెండు, మూడు సర్జరీలు నిర్వహించామని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. రొమ్ము క్యాన్సర్తో బాధపడిన ఆ మహిళ గత డిసెంబరులో మాస్టెక్టమీ చేయించుకుందని.. నాలుగు వారాల పాటు కీమోథెరపీ చికిత్స తీసుకున్నట్లు గుర్తుచేశారు. కొవిడ్ నిర్ధారణ కావడం, కీమోథెరపీ తీసుకోవడం వల్ల ఆమెలో రోగనిరోధకత మరింత క్షీణించినట్లు పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, దేశంలో మ్యూకర్మైకోసిస్ కేసులలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య దాదాపు 12వేలకు చేరింది. గడిచిన నాలుగు రోజుల్లోనే కేసుల సంఖ్యలో 32శాతం పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగించే విషయం. వీటిలో అత్యధికంగా గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. మధుమేహం, స్టెరాయిడ్లను అధికంగా వాడడమే మ్యూకర్మైకోసిస్ ఇన్ఫెక్షన్కు కారణమని నిపుణులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.