Anil Baijal : దిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ రాజీనామా!

దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. తన రాజీనామా .....

Updated : 18 May 2022 17:41 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ తన పదవికి అకస్మాత్తుగా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన రాజీనామా చేసినట్టు సమాచారం.  అంతకుముందు లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న నజీబ్‌ జంగ్‌ ఆకస్మిక రాజీనామాతో 2016 డిసెంబరు 31న అనిల్‌ బైజల్‌ బాధ్యతలు స్వీకరించారు. దిల్లీకి 21వ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్నారు. అయితే.. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో ఘర్షణాత్మక వైఖరితో అనిల్‌ బైజల్‌ పలుమార్లు వార్తల్లో  నిలిచిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని