
ఐదు నెలల తర్వాత దిల్లీ మెట్రో పరుగులు..
దిల్లీ: సుదీర్ఘ కాలం తర్వాత దేశ రాజధాని దిల్లీలో మెట్రో రైలు సేవలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల నేపథ్యంలో దశల వారీగా ఈ మెట్రో రైలు సేవలు ప్రారంభించినట్లు దిల్లీ మెట్రో రైలు అధికారులు తెలిపారు. ప్రయాణికులెవరూ కొవిడ్ బారిన పడకుండా ఉండేందుకు మెట్రో అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. దిల్లీ మెట్రో రైలు అధికారులు మాట్లాడుతూ.. ‘హోమంత్రిత్వ శాఖ ఆదేశాలతో దశల వారీగా మెట్రో సేవలు ప్రారంభించాం. సెప్టెంబర్ 7-12వ తేదీ వరకు మూడు దశలుగా మెట్రో సేవలు కొనసాగుతాయి. మొదటి రైలు సోమవారం ఉదయం దిల్లీలోని సమయ్పూర్ నుంచి గురుగ్రామ్లోని హుడా కేంద్రానికి బయలుదేరింది. కంటైన్మెంట్ జోన్లలో రైళ్లు ఆపేందుకు అవకాశం లేదు. సామాజిక దూరం పాటించడం, మాస్కులు, శానిటైజర్ల వినియోగం, థర్మల్ స్క్రీనింగ్ వంటి జాగ్రత్తలు పాటించేలా కఠినమైన ఏర్పాట్లు చేశాం’అని పేర్కొన్నారు.
దిల్లీ మెట్రో సేవలు పునఃప్రారంభం అయిన సందర్భంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రయాణికులు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. ఈ సందర్భంగా ఆయన ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ‘మెట్రో సేవలు ప్రారంభమైనందుకు సంతోషంగా ఉంది. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రయాణికులు నిర్లక్ష్యం వహించకుండా ఆయా జాగ్రత్తలు పాటించాలి’ అని విజ్ఞప్తి చేశారు.
దేశంలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో మార్చి 22 నుంచి దిల్లీతో పాటు పలు ప్రధాన నగరాల్లో మెట్రో సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు ఐదు నెలల తర్వాత సేవలు తిరిగి పునఃప్రారంభించడానికి కేంద్రం హోంశాఖ పలు మార్గదర్శకాలు జారీ చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Related-stories News
National News: యూపీలో తామ్రయుగ ఆయుధాలు
-
Politics News
Atmakur bypoll: మూడు రౌండ్లు పూర్తి.. 12వేలకుపైగా ఆధిక్యంలో వైకాపా అభ్యర్థి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Related-stories News
National News: భార్యకు కానుకగా చంద్రుడిపై స్థలం
-
Ts-top-news News
Telangana News: ఆ విద్యార్థుల సర్దుబాటు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే
-
Related-stories News
Indian railways: నాలుగు రైళ్లు 24 రోజుల పాటు రద్దు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్ఖాన్ని వదులుకున్నా!
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్స్టేషన్లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- AP Liquor: మద్యంలో విషం
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న చేతికొచ్చే వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-06-2022)
- AP sachivalayam: జులై 1 నుంచి ప్రొబేషన్