దిల్లీలో మృత్యుఘోషకు కారణాలు ఏంటంటే..!
దేశరాజధానిలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగించడానికి కొన్ని కారణాలను వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరణాల సంఖ్య మరింత ఎక్కువే అంటున్న వైద్య నిపుణులు
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. నిత్యం 400మందికిపైగా కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 448 మంది మృత్యువాతపడ్డారు. అయితే, ఇవి కేవలం ఆసుపత్రుల్లో చనిపోయినవారి లెక్కలు మాత్రమేనని.. వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని దిల్లీకి చెందిన వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దేశ రాజధానిలో కరోనా మహమ్మారి మరణ మృదంగానికి కొన్ని కారణాలను వారు విశ్లేషిస్తున్నారు.
ప్రధాన కారణాలు ఇవే..
దిల్లీలో విస్తృత వ్యాప్తి కలిగిన కొత్తరకం వైరస్లు, క్లిష్టమైన కేసుల్లో చికిత్స అందించేందుకు సరిపోయేంత మౌలిక సదుపాయాలు లేకపోవడం, ముఖ్యమైన ఔషధాలను ముందస్తుగా ఇళ్లలో దాచుకోవడం వంటి అంశాలు దిల్లీలో కరోనా మరణాలు ఎక్కువగా సంభవించడానికి ప్రధాన కారణమని వైద్య నిపుణులు పేర్కొన్నారు. చాలా ఆసుపత్రుల్లో పడకల కొరత ఏర్పడిన దృష్ట్యా ఆసుపత్రుల బయట వేచిచూసి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య వీటికి అదనమని చెబుతున్నారు. దీంతో కొవిడ్ మరణాల సంఖ్య మరింత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
వైరస్ ఒక్కటే కారణం కాదు..
తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులను చికిత్స అందించేందుకు సరిపడా మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడమే అధిక మరణాలకు కారణమని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ జుగల్ కిశోర్ పేర్కొన్నారు. కొవిడ్ మరణాలకు వైరస్ ఒక్కటే కారణం కాదని.. సరిపడా సదుపాయాలు, వనరులు లేకపోవడమే ప్రధాన కారణమని విశ్లేషించారు. ఓ వైపు అత్యవసర వైద్యం అందించాల్సిన కేసుల సంఖ్య పెరుగుతుండగా.. వారికి సరిపడా పడకలు లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇలా ఆసుపత్రులకు వచ్చే మార్గంలో లేదా పడక కోసం ఆసుపత్రి బయట వేచిచూస్తూ కొందరు రోగులు ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు మాత్రం ఆక్సిజన్ అందక మృత్యువాతపడినట్లు డాక్టర్ కిశోర్ వెల్లడించారు. ‘‘అత్యవసర చికిత్స అందిచాల్సిన రోగులు దాదాపు 10 నుంచి 20 రోజులు ఐసీయూలో లేదా ఆక్సిజన్ సహాయంతో చికిత్స తీసుకుంటారు. ఇదే సమయంలో చికిత్స కోసం వచ్చే వారిసంఖ్య మరింత పెరగడం, వారికి ఐసీయూ, ఆక్సిజన్ లభించడం లేదు. ఇక అత్యవసర సమయాల్లో వినియోగించే ఔషధాలు బ్లాక్మార్కెట్కు తరలిపోవడం లేదా చాలామంది ముందస్తుగా ఇళ్లల్లో తెచ్చిపెట్టుకోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారింది’’ అని కిశోర్ తెలిపారు.
ఐసీయూ, ఆక్సిజన్ అందక..
వైరస్ నిర్ధారణ అయిన వ్యక్తుల్లో కొందరు 14 నుంచి 15రోజుల అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురవ్వడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నట్లు గుర్తించామని దిల్లీలోని బట్రా ఆసుపత్రి డైరెక్టర్ సుదాన్షు బంకాటా వెల్లడించారు. ఇలా ఈ రోజు ఎక్కువ కేసులు నమోదయ్యాయంటే వచ్చే 14నుంచి 15రోజుల్లో వారిలో తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచే వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన అంచనా వేశారు. ఆసుపత్రుల్లో పడకల కొరత కారణంగా అధిక ఆక్సిజన్ అవసరమైన చాలా కేసుల్లో ఎక్కువ మంది ఇంటివద్దే చికిత్స తీసుకుంటున్నారు. వారికి ఆసుపత్రుల్లో పడకలు లభ్యమయ్యే సమయానికి వారి ఆరోగ్య పరిస్థితి విషమించిపోతున్నట్లు డాక్టర్ సుదాన్షు అభిప్రాయపడ్డారు.
కేసులు పెరగడం మరో కారణం..
ఇక రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా 8వేలు నుంచి 25వేలకు చేరడం కూడా మరణాల సంఖ్య పెరగడానికి కారణమని జైపూర్ గోల్డెన్ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ డీకే బలూజా పేర్కొన్నారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో సిబ్బంది, వైద్య సదుపాయాలు అందరికీ అందేలా చూడడం ఇబ్బంది కావడంతో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. కేసులు పెరుగుతున్నంత వేగంగా వైద్య సదుపాయాల సామర్థ్యం పెరగకపోవడం. తీవ్రత ఎక్కువ కావడానికి కారణమవుతోంది’ అని బలూజా పేర్కొన్నారు. ఇలా భిన్న కారణాల వల్ల దిల్లీలో కొవిడ్ మరణాల సంఖ్య పెరుగుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే, దిల్లీలో కరోనా వెలుగుచూసినప్పటి నుంచి ఇప్పటివరకు 17వేల మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోగా.. కేవలం గడిచిన రెండు వారాల్లోనే 5వేల మంది మృత్యువాతపడటం గమనార్హం. గడిచిన మూడు రోజులుగా నిత్యం అక్కడ 400లకు పైగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకారం, దేశవ్యాప్తంగా కొవిడ్తో మరణించిన వారిసంఖ్య 2లక్షల 20వేలు దాటింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్