Covid India: కొవిడ్ కేసుల్లో దిల్లీ రికార్డ్.. ఒక్కరోజే 28వేల కేసులు!
దేశ రాజధానిలో భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. నేడు ఒక్కరోజే 28,867 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.
నగరాల్లో భారీగా పెరుగుతోన్న పాజిటివిటీ రేటు
దిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే దాదాపు రెండున్నర లక్షల కేసులు నమోదు కాగా.. తాజాగా దేశ రాజధానిలో భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. నేడు ఒక్కరోజే దిల్లీలో రికార్డు స్థాయిలో 28,867 పాజిటివ్ కేసులు రావడం కలకలం రేపుతోంది. అంతేకాకుండా కొవిడ్ పాజిటివిటీ రేటు 29శాతానికి పెరిగింది. కొవిడ్ పరీక్షలు చేసుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరికి పాజిటివ్గా తేలుతోంది. ఇక దిల్లీలో ఒకేరోజు ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గతేడాది ఏప్రిల్ 20న అక్కడ అత్యధికంగా ఒక్కరోజే 28,395 పాజిటివ్ కేసులు వచ్చాయి.
ముంబయిలోనూ కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. గురువారం సాయంత్రానికి అక్కడ 13,702 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 21శాతంగా ఉన్నట్లు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించింది. ముందురోజుతో పోలిస్తే రోజువారీ కేసుల్లో కాస్త తగ్గుదల కనిపించింది. బుధవారం నాడు ముంబయిలో 16వేలకు పైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. అయితే, జనవరి 7న అత్యధికంగా 20వేల కేసులు వెలుగుచూడగా.. గత నాలుగు రోజులుగా అంతకు దిగువనే కేసులు నమోదవుతున్నాయి.
అటు కర్ణాటకలోనూ కొవిడ్ ఉగ్రరూపం చూపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 25వేల పాజిటివ్ కేసులు నమోదుకాగా ఎనిమిది మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 12.3శాతంగా ఉంది. డిసెంబర్ చివరి వారం నుంచి అక్కడ కొవిడ్ ఉద్ధృతి మరింత పెరిగింది. నిన్న ఒక్కరోజు 21వేల కేసులు రికార్డు కాగా నేడు మరింత పెరిగింది. ఇప్పటివరకు కర్ణాటకలో 31లక్షల 24వేల పాజిటివ్ కేసులు వెలుగు చూడగా.. 38,397 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి.
కోల్కతాలోనూ కొవిడ్ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. నగరంలో నిన్న ఒక్కరోజే 7వేల కేసులు నమోదయ్యాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 22వేల కేసులు రికార్డు కాగా పాజిటివిటీ రేటు 30శాతం దాటింది. అయితే, అంతకు ముందురోజు ఇది 32శాతంగా ఉంది. పశ్చిమబెంగాల్లో గత వారపు కొవిడ్ పాజిటివిటీ రేటు 60శాతం ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
ఇలా దేశవ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోన్న వేళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందన్న ఆయన.. వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓవైపు వ్యాక్సినేషన్ను ముమ్మరంగా చేపడుతూనే వైరస్ కట్టడికి స్థానికంగా కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు, కొవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని సూచించారు. ముఖ్యంగా పండగల వేళ ప్రజలు నిర్లక్ష్యం వహించవద్దని.. కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.