Viral news: 24 ఏళ్ల క్రితమే మృతి చెందాడు..కానీ, ఇప్పుడు అరెస్టయ్యాడు!

1991 ఓ దొంగతనం కేసులో నిందితుడిని దిల్లీ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. 1998లో ఆయన మృతిని ధ్రువీకరిస్తూ పోలీసులు వినిపించిన వాదనతో ఏకీభవిస్తూ అప్పట్లో ధర్మాసనం కేసును పెండింగ్‌లో పెట్టేసింది.

Published : 12 Nov 2022 02:01 IST

దిల్లీ: దాదాపు 24 ఏళ్ల క్రితమే మృతిచెందిన వ్యక్తిని దిల్లీ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఆ ‘దొంగ’ తెలివితేటలకు ముక్కున వేలేసుకోవాల్సిందే. 1991లో జరిగిన ఓ దొంగతనం కేసులో ఆ వ్యక్తి నిందితుడు. అప్పట్లో  అతడిని అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినా చిక్కలేదు. అన్ని అధికారిక రికార్డుల్లో తాను చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

రికార్డులను పరిశీలించిన పోలీసులు నిందితుడు చనిపోయాడని ధ్రువీకరించుకున్నారు. అదే విషయాన్ని 1998లో కోర్టుకు తెలిపారు. పోలీసుల వాదనను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కేసును పెండింగ్‌లో పెట్టేసింది. అయితే, తాజాగా ఆ నిందితుడి గురించి పోలీసులకు సమాచారం అందింది. దీంతో పక్కా ప్రణాళికతో నిందితుడిని అరెస్టు చేశారు. గత 24 సంవత్సరాలుగా అతడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నకిలీ పత్రాలు తయారు చేసిన వ్యక్తి గురించి నిందితుడిని ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని