దిల్లీ ఘటన: రైతు నేతలపై లుకౌట్ నోటీసులు
గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో జరిగిన అల్లర్లపై దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే రైతులకు నాయకత్వం వహిస్తున్న రాకేశ్ టికాయిత్, యోగేంద్ర యాదవ్, దర్శన్ పాల్, గుర్నాం సింగ్
దిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో జరిగిన అల్లర్లపై దిల్లీ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే రైతులకు నాయకత్వం వహిస్తున్న రాకేశ్ టికాయిత్, యోగేంద్ర యాదవ్, దర్శన్ పాల్, గుర్నాం సింగ్ చాదుతో సహా పలువురు రైతు సంఘాల నేతలపై ఎఫ్ఐఆర్ నమోదుకాగా.. నేడు తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. అంతేగాక, విదేశాలకు పారిపోయే అవకాశం లేకుండా వారి నుంచి పాస్పోర్టు స్వాధీనం చేసుకోనున్నట్లు సమాచారం.
జనవరి 26 నాటి ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర హోంశాఖ.. అల్లర్లకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది. చారిత్రక ఎర్రకోటపై మతపరమైన జెండా ఎగురవేయడం.. పోలీసులపై దాడి చేసి గాయపర్చిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు దర్యాప్తును వేగవంతం చేసిన దిల్లీ పోలీసు యంత్రాంగం నేడు రైతు సంఘాల నాయకులపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది.
పోలీసులను పరామర్శించనున్న అమిత్షా
దిల్లీ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలోనే పోలీసులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అల్లర్లలో గాయపడిన పోలీసులను షా నేడు పరామర్శించనున్నారు. రెండు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పోలీసులను కలిసి వారితో మాట్లాడనున్నారు. అమిత్ షా రాక నేపథ్యంలో దిల్లీలోని శుహ్రత్, సివిల్ లైన్స్ ఆసుపత్రుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. హాస్పిటల్స్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి.. భారీగా పోలీసులు మోహరించారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
గణతంత్ర దినోత్సవం నాడు చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. హింసకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.
సరిహద్దుల్లో భద్రత పెంపు
మరోవైపు సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని సరిహద్దుల్లో భద్రతను పెంచారు. ఎర్రకోట వద్ద కూడా భారీగా బలగాలను మోహరించారు. ఈ నెల 31 వరకు ఎర్రకోటను మూసివేశారు.
ఇవీ చదవండి..
దిల్లీ ఘటన: దీప్ సిద్ధూ ఎక్కడ?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పీవీకి భారతరత్న ప్రదానం.. స్వీకరించిన కుమారుడు
Bharat Ratna: మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో సత్కరించిన సంగతి తెలిసిందే. ఆ అవార్డును నేడు కుటుంబసభ్యులు స్వీకరించారు. -
మద్యం కేసు.. మరో ఆప్ మంత్రిని ప్రశ్నించిన ఈడీ
Delhi Excise Policy Case: దిల్లీ మద్యం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో మంత్రిని ఈడీ శనివారం విచారించింది. -
కాలేజీ విద్యార్థికి రూ.46 కోట్ల పన్ను నోటీసులు..
Tax Notice To Student: మధ్యప్రదేశ్కు చెందిన ఓ విద్యార్థికి రూ.46 కోట్ల పన్ను నోటీసులు రావడం కలకలం రేపింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం ఈడీ యత్నాలు
భాజపా రాజకీయ ఆయుధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యవహరిస్తోందని దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపించారు. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మొబైల్ ఫోన్ను పరిశీలించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లోక్సభ ఎన్నికల వ్యూహాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తోందన్నారు. -
డిజిటల్ అంతరాలను చెరిపేస్తాం
భారతదేశంలో డిజిటల్ అంతరాలను చెరిపేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సాంకేతికతను గ్రామాలకూ తీసుకువెళతామని తెలిపారు. కృత్రిమ మేధ(ఏఐ)ని ఓ మంత్రదండంగా చూడకూడదని అన్నారు. -
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకూ ఎగ్జిట్ పోల్స్కు అనుమతి లేదు.. ఈసీ
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి ఎన్నికల సంఘం(ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. -
అటు ప్రసవం.. ఇటు శివస్తోత్రం
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో తొలిసారిగా ఓ నవజాత శిశువు తన నానమ్మ పాడుతున్న శివ భజనలు వింటూ తల్లి గర్భం నుంచి బయటికొచ్చాడు. -
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో.. డెత్ మిస్టరీ ఛేదించిన పోలీసులు
మహారాష్ట్రలోని కల్యాణ్లో రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నుంచి ఫోను అపహరించేందుకు దొంగ ప్రయత్నించాడు. -
చెరువులో ఈతకు పోతే.. గొంతులో చేప ఇరుక్కొంది!
ఛత్తీస్గఢ్లోని జాంజ్గీర్ చాంపా జిల్లాలో పద్నాలుగేళ్ల బాలుడి గొంతులో చేప ఇరుక్కుపోయింది. -
‘సీ-విజిల్’ ద్వారా 79 వేల ఫిర్యాదులు నమోదు
ప్రజలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను తెలియజేయడానికి ఎన్నికల సంఘం(ఈసీ) ప్రవేశపెట్టిన ‘సీ-విజిల్’ యాప్ సమర్థంగా పనిచేస్తోందని, ఎన్నికల షెడ్యుల్ను ప్రకటించినప్పటి నుంచి దీని ద్వారా 79 వేలకు పైగా ఫిర్యాదులు అందాయని ఈసీ శుక్రవారం తెలిపింది. -
యూపీలో భద్రత కట్టుదిట్టం
గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) మృతితో ఉత్తర్ప్రదేశ్లోని పలు జిల్లాల్లో శుక్రవారం భద్రతా చర్యలను అధికారులు కట్టుదిట్టం చేశారు. -
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
మొబైల్ యూజర్లకు కేంద్ర టెలి కమ్యూనికేషన్ విభాగం(డీఓటీ) శుక్రవారం ఓ అడ్వైజరీ జారీచేసింది. -
బధిరులు, అంధులు కూడా సినిమాలను ఆస్వాదించే ఏర్పాట్లు ఉండాలి
సినిమాలను ఆస్వాదించే సౌలభ్యం బధిరులు, అంధులకు కూడా అందుబాటులో ఉండాలని దిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. -
కిచిడీ కుంభకోణంలో శివసేన (యూబీటీ) నేతకు ఈడీ సమన్లు
కిచిడీ కుంభకోణంలో శివసేన (యూబీటీ) నేత, లోక్సభ ఎన్నికల అభ్యర్థి అమోల్ కీర్తికర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం మరోసారి సమన్లు జారీ చేసింది. -
త్వరలో దిల్లీ సీఎంగా ‘మేడం’
ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు కేజ్రీవాల్కు చాలా తక్కువ సమయమే ఉందని, అందుకే ఆ స్థానంలో భార్య సునీతను కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు. -
లోక్సభ సభ్యుల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు
లోక్సభలోని 514 మంది సిట్టింగ్ ఎంపీల అఫిడవిట్లను పరిశీలించగా, వారిలో 225 మంది(44 శాతం) తమపై క్రిమినల్ కేసులు నమోదయినట్లు పేర్కొన్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) వెల్లడించింది. -
కేంద్ర మంత్రికి నామినేషన్ రుసుం చెల్లించిన విద్యార్థులు
లోక్సభ ఎన్నికల్లో కేరళలోని అత్తింగళ్ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా విదేశీ వ్యవహారాల సహాయమంత్రి వి.మురళీధరన్ బరిలో దిగారు. -
జమ్మూ లోయలో పడ్డ వాహనం
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. రాంబన్ జిల్లా బ్యాటరీ చశ్మా ప్రాంతంలో రహదారిపై ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. -
నిన్న అమెరికా, నేడు ఐరాస
భారత్ సహా ఎన్నికలు జరగనున్న అన్ని దేశాల్లో ప్రజల రాజకీయ, పౌర హక్కులకు రక్షణ ఉంటుందని భావిస్తున్నామని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ అన్నారు. -
ముఖ్తార్ అన్సారీ చావుతో న్యాయం జరిగింది: అల్కా రాయ్
ముఖ్తార్ అన్సారీ చావుతో తన కుటుంబానికి న్యాయం జరిగిందని దివంగత భాజపా ఎమ్మెల్యే ఆనంద్రాయ్ సతీమణి అల్కారాయ్ అన్నారు. -
కేంద్ర మంత్రికి కృతజ్ఞతతో..! నామినేషన్ రుసుం చెల్లించిన విద్యార్థులు
కేరళలోని అత్తింగళ్ నుంచి బరిలో దిగిన భాజపా అభ్యర్థి, విదేశాంగ సహాయ మంత్రి వి.మురళీధరన్ నామినేషన్ డిపాజిట్ సొమ్ము చెల్లించేందుకు విద్యార్థులు ముందుకు రావడం విశేషం.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గ్యాంగ్లీడర్ను ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లి.. బందీగా మారి..!
-
మచిలీపట్నం జనసేన లోక్సభ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి
-
భారీ ప్రాజెక్ట్ చేజారిపోయింది.. ఆ విషయం నన్నెంతో భయపెడుతుంది: మృణాల్
-
తిరుమల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? దర్శనం, ప్రయాణ టికెట్లతో ఐఆర్సీటీసీ ప్యాకేజీలు ఇవే..
-
ఇసుక రీచ్ వద్ద దాడి.. ఇరువర్గాలపై కేసు నమోదు