NewsClick: మళ్లీ తెరపైకి ‘న్యూస్క్లిక్’ వివాదం.. ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లల్లో సోదాలు
ప్రముఖ ఆన్లైన్ మీడియా సంస్థ న్యూస్క్లిక్ (NewsClick) ఆఫీసులు, ఆ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల ఇళ్లల్లో దిల్లీ పోలీసులు సోదాలు చేపట్టారు. చైనా నుంచి నిధులు అందుతున్నాయన్న ఆరోపణలపై ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
దిల్లీ: ఆన్లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్క్లిక్ (NewsClick)కు చైనా (China) నుంచి నిధులు (Funds) అందుతున్నాయంటూ ఇటీవల వచ్చిన ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన దిల్లీ పోలీసులు (Delhi Police).. న్యూస్క్లిక్ ఆఫీసు, ఆ మీడియా సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టుల ఇళ్లల్లో సోదాలు (Raids) చేపట్టారు.
మంగళవారం ఉదయం దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విభాగం అధికారులు.. స్థానిక న్యూస్క్లిక్ (NewsClick) కార్యాలయంతో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టుల ఇళ్లల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు చేపట్టారు. దాదాపు 30 ప్రదేశాల్లో చేపట్టిన ఈ సోదాల్లో పెద్ద ఎత్తున ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీలపై ఓ సీనియర్ జర్నలిస్టు సోషల్మీడియాలో స్పందిస్తూ.. ‘‘నా ల్యాప్టాప్, ఫోన్ను పోలీసులు తీసుకెళ్లారు’’ అని వెల్లడించారు.
హత్యచేసి.. బతికుందని నమ్మించాడు: దిల్లీలో ఓ పోలీసు దురాగతం
న్యూస్ క్లిక్కు చైనా నుంచి నిధులు అందుతున్నాయంటూ ఈ ఏడాది ఆగస్టులో ‘న్యూయార్క్ టైమ్స్’ వంటి అమెరికా పత్రికలు కథనాలు ప్రచురించాయి. అమెరికా మిలియనీర్ నెవిల్లే రాయ్ సింగం, ఆయనకు చెందిన న్యూస్ క్లిక్.. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు చెందిన ప్రమాదకరమైన సాధనాలని పేర్కొన్నాయి. దీంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలోనే ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దీనిపై కేసు నమోదు చేసి.. ‘న్యూస్క్లిక్’ ఆఫీసులో సోదాలు నిర్వహించింది. ఈ పోర్టల్కు సంబంధించిన కొన్ని ఆస్తులను కూడా అటాచ్ చేసింది.
ఈ దర్యాప్తు సంస్థ ఇచ్చిన సమాచారంతో ఆగస్టులో దిల్లీ పోలీసులు ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద న్యూస్క్లిక్పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే తాజాగా సోదాలు చేపట్టినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. న్యూస్క్లిక్ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా 2021లో సోదాలు నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదిగా తల్లి మృతదేహంతో ఇంట్లోనే అక్కాచెల్లెళ్లు..
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఏడాది క్రితం చనిపోయిన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని జీవిస్తున్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. -
శ్రీనగర్ నిట్లో సోషల్ మీడియా దుమారం
జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్ ఎన్ఐటీలో మతపరమైన అంశంపై సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుకు నిరసనగా కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు. -
పల్లెటూరి మేడం యూట్యూబ్ ఆంగ్ల పాఠాలు అదుర్స్
ఉత్తర్ప్రదేశ్లోని కౌశాంబీ జిల్లా సిరాథూ నగర పంచాయతీకి చెందిన యశోద అనే గ్రామీణ యువతి ఆంగ్ల బోధనకు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి విశేష ఆదరణ చూరగొంటోంది. -
గేటెడ్ కమ్యూనిటీ రోడ్లపై ఎవరైనా వెళ్లవచ్చు!
గేటెడ్ కమ్యూనిటీల్లోని రహదారులపై బయటి వారు కూడా రాకపోకలు సాగించవచ్చని కర్ణాటక ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. -
సిల్క్యారాలోనా.. సొంత ఊళ్లకా!
మృత్యువు అంచువరకు వెళ్లి రెండ్రోజుల క్రితం క్షేమంగా తిరిగివచ్చిన సిల్క్యారా సొరంగ కార్మికులు ఇప్పుడు అక్కడే ఉండి ఎప్పటిలా పనిచేసుకోవాలా, సొంత ఊళ్లకు వెళ్లిపోవాలా అనే ఊగిసలాటలో ఉన్నారు. -
నా దృష్టిలో పెద్దకులాలు ఆ నాలుగే
‘నా దృష్టిలో నాలుగు పెద్ద కులాలవారంటే పేదలు, యువత, మహిళలు, రైతులు. వారి ఎదుగుదలతోనే దేశం అభివృద్ధి చెందుతుంది’ అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
ఒడిశా అడవుల్లో బ్లాక్ పాంథర్
ఒడిశా అడవుల్లో బ్లాక్ పాంథర్(నల్ల చిరుత) కనిపించింది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) సుశాంత నందొ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వివరాలు వెల్లడించారు. -
కన్నూర్ వర్సిటీ వీసీగా రవీంద్రన్ పునర్నియామకం కొట్టివేత
కేరళలోని కన్నూర్ యూనివర్సిటీ ఉప కులపతి (వైస్ఛాన్సలర్/వీసీ)గా గోపీనాథ్ రవీంద్రన్ పునర్నియామకాన్ని సుప్రీం కోర్టు గురువారం కొట్టివేసింది. -
విమానంలో నీటి ధార
విమానంలో క్యాబిన్ పైకప్పు నుంచి ఏర్పడిన నీటి లీకేజీతో ప్రయాణికులు ఇబ్బంది పడిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది. -
శోమాకాంతి సేన్ బెయిల్ అభ్యర్థనను వ్యతిరేకించిన ఎన్ఐఏ
ఎల్గార్ పరిషద్ - మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు శోమాకాంతి సేన్ ఆరోగ్య కారణాలతో సుప్రీంకోర్టులో పెట్టుకున్న మధ్యంతర బెయిల్ అభ్యర్థన పిటిషన్ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గట్టిగా గురువారం వ్యతిరేకించింది. -
నాడు భారత్ను ద్వేషించి.. నేడు ప్రేమించి..!
అమెరికా భద్రతా సలహదారుడిగా, విదేశాంగ మంత్రిగా హెన్రీ కిసింజర్ 70వ దశకంలో తీవ్ర భారత్ వ్యతిరేకవైఖరిని అవలంబించారు. పాకిస్థాన్తో మాత్రం సత్సంబంధాలు కొనసాగించారు. -
కుర్చీ పట్టుకోమ్మా.. లేదా ఆమె కూర్చుంటుంది: మోదీ
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎక్కువమందికి చేర్చడానికి ఉద్దేశించిన ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’లో భాగంగా వివిధ స్కీంల లబ్ధిదారులను ఉద్దేశించి గురువారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. -
సాధ్యమైనంత త్వరగా తదుపరి విడత సైనిక చర్చలు
తూర్పు లద్దాఖ్లో బలగాల ఉపసంహరణను పూర్తిచేయడంతోపాటు అపరిష్కృతంగా ఉన్న పలు అంశాలపై భారత్, చైనాలు గురువారం దౌత్యపరమైన చర్చలు జరిపాయి. -
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ రేపు
ఈ నెల 4 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శనివారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. -
జ్ఞానవాపి సర్వే నివేదిక సమర్పణకు 10 రోజుల గడువు
ఉత్తర్ప్రదేశ్లోని కాశీలో జ్ఞానవాపి మసీదు ఆవరణలో భారత పురావస్తు విభాగం (ఏఎస్ఐ) నిర్వహించిన సర్వే నివేదిక తయారీ, సమర్పణకు వారణాసి జిల్లా కోర్టు మరో 10 రోజుల గడువిచ్చింది. -
వాయు కాలుష్యంతో భారత్లో ఏటా 21 లక్షల మంది బలి
ఆరుబయట చోటుచేసుకుంటున్న వాయు కాలుష్యం వల్ల భారత్లో ఏటా 21.8 లక్షల మంది బలవుతున్నారని తాజా అధ్యయనం పేర్కొంది. -
న్యాయాధికారులకు గౌరవప్రదమైన సౌకర్యాలు
న్యాయాధికారులకు గౌరవప్రదమైన సౌకర్యాలు, పని వాతావరణం ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని సుప్రీంకోర్టు గురువారం స్పష్టంచేసింది. -
లోక్సభ సెక్రటరీ జనరల్ పదవీ కాలం పొడిగింపు
లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
సిల్క్యారా కార్మికులకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా
సిల్క్యారా సొరంగం నుంచి బయటకు వచ్చిన 41 మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను చెక్కుల రూపంలో అందించినట్లు ఈ పనులు చేపట్టిన ‘నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్’ తెలిపింది. -
ప్రైవేటు పర్యటనల్లో విదేశీ ఆతిథ్యానికి అనుమతి తప్పనిసరి
ప్రైవేటు పర్యటనల్లో విదేశీ ఆతిథ్యం పొందేందుకు పార్లమెంటు సభ్యులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. -
రాజకీయ కక్షలకు వేదికగా సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టుకు తప్పుడు కేసులు వెల్లువెత్తుతున్నాయని, ఎన్నికలు సమీపించే సమయంలో అవి మరింత అధికమవుతున్నాయని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తెలిపారు.


తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వ మద్యంలో రంగునీళ్లు కలిపి విక్రయం.. రాజమహేంద్రవరంలో ఘటన
-
Special Trains: 10 ప్రత్యేక రైళ్ల పొడిగింపు
-
Hyderabad: హోటళ్లు తెరచుకోక ఇక్కట్లు
-
JEE Mains: జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు
-
ప్రియుడి సూచనతో.. లేడీస్ హాస్టల్ టాయిలెట్లో రహస్య కెమెరా!
-
శ్రీనగర్ నిట్లో సోషల్ మీడియా దుమారం