‘జూమ్’ వేదికగా టూల్కిట్ పన్నాగం!
వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తోన్న ఆందోళనకు మద్దతుగా రూపొందించిన టూల్కిట్ వివాదంపై దిల్లీ పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు.
ఎవరెవరు పాల్గొన్నారనే కోణంలో దర్యాప్తు
జూమ్కు పోలీసుల లేఖ
దిల్లీ: వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తోన్న ఆందోళనకు మద్దతుగా రూపొందించిన టూల్కిట్ వివాదంపై దిల్లీ పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. దీని వెనుక ఎవరున్నారు అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు. ఇందులోభాగంగా, గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన హింసాత్మక ఘటనలకు ముందు(జనవరి 11న) నిర్వహించిన సమావేశ వివరాలు అందించాలని ‘జూమ్’ వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమానికి దిల్లీ పోలీసులు లేఖ రాశారు.
జూమ్ మీటింగ్లో 70మంది..
వ్యవసాయ చట్టాల విషయంలో భారత ప్రతిష్ఠను మసకబార్చే లక్ష్యంతో రూపొందించిన ఈ టూల్కిట్కు సంబంధించి ఇప్పటికే గూగుల్తో పాటు ఇతర సామాజిక మాధ్యమ సంస్థల నుంచి వివరాలను సేకరించారు. ఖలిస్థాన్ అనుకూల సంస్థ ఏర్పాటు చేసినట్లు భావిస్తోన్న ఈ జూమ్ సమావేశంలో దాదాపు 70మంది పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాన సూత్రధారులుగా అనుమానిస్తోన్న ముంబయికి చెందిన న్యాయవాది నికిత జాకబ్, పుణెకు చెందిన ఇంజినీర్ శంతనులు హాజరైనట్లు దిల్లీ పోలీసులు ఇప్పటికే స్పష్టంచేశారు. వీరితోపాటు ఎవరెవరు పాల్గొన్నారనే విషయంపై జూమ్ నుంచి మరిన్ని వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అయితే, ఈ టూల్కిట్(గూగుల్ డాక్యుమెంట్) కోసం వినియోగించిన ఈ మెయిల్ శంతునుదేనని పోలీసులు పేర్కొన్నారు.
ఖలిస్థాన్ అనుకూల సంస్థతో..
ఖలిస్థాన్ మద్దతు సంస్థ ‘పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్(పీజేఎఫ్)’ వ్యవస్థాపకుడు మొధాలీవాల్ తొలుత నికిత జాకబ్, శంతనులను సంప్రదించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరికి కెనడాకు చెందిన పునిత్ అనే మహిళ కూడా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. జనవరి 11న పీజేఎఫ్ ఏర్పాటు చేసిన ఈ జూమ్ సమావేశంలోనే ఈ డాక్యుమెంట్ ఎలా రూపొందించాలో నిర్ణయించడమే కాకుండా, ఈ టూల్కిట్కి ‘గ్లోబల్ ఫార్మర్ స్ట్రైక్’, ‘గ్లోబల్ డే ఆఫ్ యాక్షన్, 26 జనవరి’ అని పేరు పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
దిశ అరెస్టు చట్టప్రకారమే..
దిశరవిని చట్ట ప్రకారమే అదుపులోకి తీసుకున్నామని దిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. ‘దిశ అరెస్టు విషయానికి వస్తే..మేం అన్ని నిబంధనలు పాటించాం. 22 ఏళ్లు, 50 ఏళ్లు అనే వయసు తేడాలు చట్టానికి ఉండవు. అరెస్టు విషయంలో నిబంధనలు పాటించలేదనేది అవాస్తవం’ అని ఆయన వెల్లడించారు.
రైతుల నిరసనల్లో భాగంగా జనవరి 26న నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఆ రోజున నిరసనకారులు చారిత్రక ఎర్రకోట వద్ద మతపరమైన జెండా ఎగరవేశారు. అప్పటి ఘటనల నేపథ్యంలో రైతులకు అంతర్జాతీయంగా ప్రముఖుల నుంచి మద్దతు లభించింది. ఈ క్రమంలో పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్ టూల్ కిట్ను షేర్ చేశారు. ఇప్పుడదే వివాదానికి మూలబిందువైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..