Delhi: ఈ నగరానికి ఏమైంది? దిల్లీని వణికిస్తున్న కాలుష్య భూతం!
అస్త్రశస్త్రాలన్నీ వాడుతున్నారు... బాబ్బాబు.. మీరూ సహకరించండి అని జనాన్ని వేడుకుంటున్నారు... అయినా కాలుష్య భూతం అదుపులోకి రావడం లేదు...
అస్త్రశస్త్రాలన్నీ వాడుతున్నారు... బాబ్బాబు.. మీరూ సహకరించండి అని జనాన్ని వేడుకుంటున్నారు... అయినా కాలుష్య భూతం అదుపులోకి రావడం లేదు... దిల్లీకి పట్టిన పీడ విరగడవడం లేదు... ఇదికాక ‘మీతో కాకపోతే నగరంలో తాత్కాలికంగా లాక్డౌన్ అయినా విధించండి’ అంటూ అత్యున్నత న్యాయస్థానం తాజా హుంకరింపు! దీంతో ఆప్ ప్రభుత్వానికి ఇదో పెద్ద తలనొప్పి వ్యవహారంలా మారింది... ఇంతకీ స్వచ్ఛ రాజధాని కోసం సర్కారు ఏం చేసింది? ఏం చేయబోతోంది? అంటే...
* 2016 శీతకాలంలో కాలుష్యం, పొగమంచు కమ్మేసినప్పుడు నిరవధికంగా విద్యాసంస్థలను మూసేశారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవులిచ్చారు. స్కూల్ బస్లు, క్యాబ్లు ఆగిపోవడంతో కాలుష్యం తగ్గుతుందనే ఉద్దేశంతో.
* ఆ సమయంలోనే పాత నిర్మాణాలు కూల్చివేయడంపై నిషేధం విధించారు. అలా చేస్తే దుమ్ము, ధూళి వాతావరణంలోకి వెలువడటం తగ్గుతుందనే ఈ నిర్ణయం.
* ఆసుపత్రులు, అత్యవసరాలకు తప్ప డీజిల్ జనరేటర్లు వాడొద్దనే నిబంధన తీసుకొచ్చారు.
* 2017 నవంబరులోనే దిల్లీ నగరంలో టపాసులు కాల్చడంపై నిషేధం విధించింది అక్కడి ప్రభుత్వం.
* తీవ్రమైన కాలుష్యం వెదజల్లుతుందనే ఉద్దేశంతో నగర సమీపంలోని బదార్పూర్ పవర్ప్లాంట్ని శాశ్వతంగా మూసివేశారు.
* ఐదేళ్ల నుంచే దేశ రాజధాని ప్రాంతంలో తక్కువ కాలుష్యం వెలువరించే బీఎస్-6 కార్లను మాత్రమే వాడకానికి అనుమతిస్తున్నారు.
* అక్రమంగా నిర్మితమై, విద్యుత్తు కోసం డీజిల్ జనరేటర్లు ఉపయోగిస్తున్న కాలనీలకు ప్రభుత్వమే విద్యుత్తు సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు.
* చెట్ల ఆకులు, వ్యర్థాలు కాలుస్తూ పొగ వెలువడటానికి కారణమవుతున్న సంఘటనలను అరికట్టేలా దిల్లీ పర్యావరణ శాఖ ఓ యాప్ రూపొందించింది.
* ‘ఫేమ్’ పథకం కింద బ్యాటరీ వాహనాలు కొన్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం సైతం భారీ రాయితీలిస్తోంది.
* పదిహేనేళ్ల పరిమితి దాటిన వాహనాలు దిల్లీ రోడ్లపై తిరగడానికి వీల్లేదనే నిబంధన తీసుకొచ్చారు.
* నగర వాతావరణం, గాలిని శుద్ధి చేసేలా దిల్లీ నగరం అంతటా ‘స్మాగ్ టవర్లు’ ఏర్పాటు చేశారు.
* ప్రతిష్ఠాత్మక దిల్లీ మెట్రో ప్రస్తుతం 80 శాతానికిపైగా సౌరవిద్యుత్తుతో పని చేస్తోంది. దీనికోసం ‘రేవా మెగా సోలార్ ప్రాజెక్ట్’తో ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండేళ్లలో వందశాతం సోలార్ విద్యుత్తునే ఉపయోగించేలా ప్రణాళికలు రచించారు.
* అక్టోబర్ 2020లో ‘గ్రీన్ దిల్లీ’ మొబైల్ యాప్ అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా కాలుష్యకారక విషయాలపై వచ్చిన ఫిర్యాదులు పరిష్కరించడానికి పదిమంది సభ్యులతో కూడిన పొల్యూషన్ కంట్రోల్ టీం ఏర్పాటు చేశారు.
* ఆప్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాలుష్యం తగ్గించడానికి సరి, బేసి అంకెల వాహన వాడక విధానం అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం సరి అంకెలు ఉన్న వాహనాలు ఒకరోజు, బేసి అంకెలున్న వాహనాలు మరోరోజు మాత్రమే రోడ్లపైకి రావాలనే నిబంధన పెట్టారు.
ఏం చేయబోతున్నారు?
* కాలుష్య స్థాయిలు ‘ఎమర్జెన్సీ’ స్థాయికి చేరడంతో వచ్చే సోమవారం వరకు స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని ఆజ్ఞలిచ్చారు.
* నవంబరు 17 దాకా అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని సూచించారు. ట్రాఫిక్ని తగ్గించేందుకు ప్రైవేటు సంస్థలు సైతం ఈ విధానం పాటించాలని సూచించారు.
* భవన నిర్మాణ కూల్చివేతలపై నిషేధం కొనసాగుతోంది.
* కాలుష్యాన్ని తగ్గించే ‘యాంటీ స్మాగ్ గన్స్’ని పదిచోట్ల ఏర్పాటు చేయబోతున్నారు.
* ‘రెడ్లైట్ ఆన్, గాడీ ఆఫ్’ ప్రచారం ఉధృతం చేశారు. ఎర్ర లైట్ పడితే ఇంజిన్ ఆఫ్ చేయడం లక్ష్యం.
* ఉత్తరాదిలో పంట కోసిన తర్వాత మిగిలిన కొయ్యలను కాల్చడం అలవాటు. ఇది పెద్దఎత్తున కాలుష్యానికి కారణమవుతోంది. దీనికి విరుగుడుగా ఇండియన్ అగ్రికల్చర్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలతో కలిసి ఈ కొయ్యలను కుళ్లబెట్టి, ఎరువుగా మార్చేలా ‘పూసా కంపోజర్’ ఎరువును తయారు చేశారు. రైతులకు ఉచితంగా అందజేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి