Positivity Rate: దిల్లీలో 0.30 శాతానికి
ఒక దశలో 36 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు.. ప్రస్తుతం 0.30 శాతానికి దిగివచ్చింది. గడిచిన 3 నెలల్లో అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 71,513 పరీక్షలు నిర్వహించగా....
దిల్లీ: రోడ్లపై అంబులెన్స్ల కూతలు.. ఆసుపత్రుల ముందు బాధితుల క్యూలు.. ఆక్సిజన్ అందక మృత్యు కేకలు.. ప్రతిరోజూ వందల సంఖ్యలో మరణాలు.. ఇదీ కొద్ది రోజుల క్రితం దేశ రాజధాని దిల్లీలో కరోనా మహమ్మారి సృష్టించిన విలయం. లాక్డౌన్ విధించడంతో పరిస్థితులు కుదురుకుంటున్నాయి. రోజురోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం అక్కడ అన్లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. ఒక దశలో 36 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు.. ప్రస్తుతం 0.30 శాతానికి దిగివచ్చింది. గడిచిన 3 నెలల్లో అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 71,513 పరీక్షలు నిర్వహించగా.. 213 మందికి పాజిటివ్గా తేలింది. 28మంది మృతిచెందారు. దిల్లీలో గడిచిన 24 గంటల్లో 497 మంది రికవరీ అయ్యారు.
భారత్లో కరోనా మూడో దశ రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో దిల్లీ సర్కారు అప్రమత్తమైంది. కరోనా రెండో దశ సమయంలో ఆసుపత్రుల్లో పడకల కొరత, తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో వాటిని అధిగమించేందుకు సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఆరోగ్య మౌలిక సదుపాయాలు, ప్రాణవాయువు సదుపాయాలను పెంచుకుంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..