MCD polls 2022: ఓటేయాలని ఎంతో ఆశతో వచ్చాం.. కానీ!: దిల్లీ ఓటర్ల ఆగ్రహం
దేశ రాజధాని దిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల(MCD polls2022) నిర్వహణలో అధికారుల వైఫల్యం ఓటర్లకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు పోలింగ్ కేంద్రాలకు ఎంతో ఆశగా తరలివస్తోన్న పలువురు ఓటర్లకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది.
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల(MCD Polls 2022) నిర్వహణలో అధికారుల వైఫల్యం ఓటర్లకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు పోలింగ్ కేంద్రాలకు ఎంతో ఆశగా తరలివస్తోన్న పలువురు ఓటర్లకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. తమ పోలింగ్ బూత్ ఎక్కడో తెలియని అయోమయ పరిస్థితుల్లో కొందరు, ఓటరు జాబితాలో పేర్లులేకపోవడంతో మరికొందరు చివరకు ఓటేయకుండానే వెనుదిరుగుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో పోలింగ్ నిర్వహణ తీరుపట్ల ఓటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పోలింగ్ బూత్ కోసం 2గంటలు తిరిగాం..!
దిల్లీలోని మొత్తం 250 వార్డులకు జరుగుతున్న త్రిముఖ పోరులో భాజపా-ఆప్-కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజలంతా బాధ్యతగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఓటేసేందుకు వచ్చిన కొందరు ఓటర్లకు మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో అనేకమంది అయోమయానికి, అసహనానికి గురవుతున్నారు. ఒక్కో ఓటరుకు ఒక్కోరకమైన అనుభవం ఎదురవుతోంది. ‘‘నేను ఒక గంటకు పైగా నా బిడ్డను పట్టుకొని పోలింగ్ బూత్ కోసం తిరుగుతున్నా. కానీ ఇప్పటికీ నా బూత్ ఎక్కడుందో తెలియలేదు. వేర్వేరు బూత్లకు అధికారులు పంపుతున్నారు. నా భార్య ఓటు వేసింది. కానీ నేను వేయలేకపోయా. పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చినా ఎక్కడ ఓటు వేయాలో ఎవరికీ అర్థంకావడంలేదు’’ అని కౌల్ రామ్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే, దాదాపు 20మందికి పైగా కుటుంబ సభ్యులు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చినా.. ఎక్కడ ఓటు వేయాలో తెలియక తిరిగి వెళ్లిపోతున్నట్టు ఓ మహిళ తెలిపారు. రెండు గంటల పాటు పోలింగ్ కేంద్రానికి తిరిగామని.. అక్కడ తమకు ఓట్లు లేవని చెప్పి వేర్వేరు బూత్లకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎక్కడ తమ ఓట్లు ఉన్నాయో తెలియకపోతే ఎలా వేయగలం అంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు.
తొలిసారి ఓటేద్దామని వచ్చా..
‘‘గత రెండు గంటల వ్యవధిలో వివిధ పోలింగ్ కేంద్రాల్లోని ఏడెనిమిది బూత్లకు వెళ్లాలని అధికారులు సూచించారు. నేను నా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆశగా వచ్చాను. కానీ ఓటేయలేకపోయా. ఇది సరైన పద్ధతి కాదు. చివరకు ఓటు వేయకుండానే వెళ్లిపోతున్నా’’ అని తొలిసారి తన ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఉత్సాహంతో వచ్చిన యువతి వాపోయారు. అలాగే, వృద్ధులకూ ఇదేరకమైన సమస్య ఎదురవుతోంది. పోలింగ్ బూత్ ఎక్కడుందో తెలుసుకొనేందుకు తాము ఒకచోట నుంచి ఇంకోచోటకు తిరిగే ఓపిక లేకపోవడంతో తిరిగివెళ్లిపోవాల్సి వస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు.
ఓటర్ల జాబితాలో చాలా పేర్లు లేవు.. ఇదో కుట్ర: సిసోడియా
దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో అనేకమంది పేర్లు గల్లంతయ్యాయని, ఇదంతా ఓ కుట్ర అని డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియా ఆరోపించారు. అనేకమంది ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు తమ జాబితాలోతమ ఓట్లు లేవని వాపోతున్నారన్నారు. ఓటరు జాబితాలో తమ పేర్లు లేకపోవడంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని చెప్పారు. ఈ కుట్రపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మరోవైపు, ఓటరు జాబితాలు అప్డేట్ కాకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైనట్టు పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు చెబుతున్నారు. కొందరు ఓటర్ల సరైన అడ్రస్లు అప్డేట్ కాలేదని.. ఆధార్ కార్డులను లింక్ చేయకపోవడం, ఇతర సమస్యల వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్టు చెబుతున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), భాజపా, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నెలకొన్న దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 250 వార్డులకు గాను మొత్తం 1,349 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1.45 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం 4గంటల వరకు దాదాపు 45శాతం మేర పోలింగ్ నమోదైనట్టు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
Fake Calls: టెలికాం శాఖ పేరుతో మీకు కాల్స్ వస్తున్నాయా?ఫోన్ నంబరు డిస్కనెక్ట్ చేస్తామని బెదిరిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. -
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు (Latest News)
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ