Corona: వెంటనే మూడోదశ వస్తే.. కష్టమే!
కరోనా వైరస్ రెండో దశలో డెల్టా వేరియంట్ ప్రబలంగా వ్యాప్తి చెందిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. అయితే ప్రస్తుతం కేరళలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందని మీడియా సమావేశంలో భాగంగా వెల్లడించారు.
కేరళలో రెండో దశలో డెల్టా వేరియంట్ విస్తృత వ్యాప్తి
తిరువనంతపురం: కరోనా వైరస్ రెండో దశలో డెల్టా వేరియంట్ విస్తృతంగా వ్యాప్తి చెందిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. అయితే ప్రస్తుతం కేరళలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందని మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.
‘ఆసుపత్రుల్లో కరోనా బాధితుల సంఖ్య తగ్గుతోంది. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు లాక్డౌన్ ఆంక్షలు పనిచేశాయి. మరణాల విషయంలో ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే.. కేరళ మెరుగైన పనితీరు చూపింది. అయితే పూర్తి స్థాయిలో ఆంక్షల సడలింపునకు పరిస్థితులు అనుకూలంగా లేవు. గత మూడురోజులుగా సగటు పాజిటివిటీరేటు 13.9 శాతంగా నమోదవుతోంది. దాన్ని 10శాతం దిగువకు తీసుకురావడమే లక్ష్యం. ఇంటా బయటా ప్రజలు కచ్చితంగా కొవిడ్ ఆంక్షలను పాటించాలి’ అని విజయన్ సూచించారు. అలాగే రాష్ట్రంలో 6.61శాతం మంది రెండు డోసులు పొందగా.. 25శాతం మందికిపైగా మొదటి డోసును స్వీకరించారని వివరించారు.
ఇప్పటికే కరోనా రెండోదశ తీవ్రరూపం దాల్చగా.. వెంటనే మూడోదశ దాడి చేస్తే పరిస్థితులు సంక్లిష్టంగా మారతాయని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ‘మరో దఫా వైరస్ విజృంభిస్తే ..భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. లాక్డౌన్ ఆంక్షల తర్వాత ప్రజలు నిబంధనలు పాటించాలి. ఈ సమయంలో మరిన్ని వైద్యసదుపాయాలను సమకూర్చనున్నాం’ అని వివరించారు. అలాగే మూడో దశ పిల్లలపై ప్రభావం చూపనుందనే ఆందోళనల నేపథ్యంలో వ్యాధి నివారణకు విస్తృతమై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేరళలో 24 గంటల వ్యవధిలో 14,233 మందికి కరోనా సోకగా..173 మంది ప్రాణాలు వదిలారు. మొత్తంగా 27లక్షల మందికి కరోనా సోకగా..10వేలకు మందికిపైగా బలయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!