మాటలకు.. చేతలకు పొంతనలేనిదే డ్రాగన్
‘భారత్-చైనా మిత్రదేశాలు’ అంటూ చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ నిన్న ప్రకటించారు. అదే సమయంలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. భారత్పై నిఘాను చైనా మరింత పటిష్టం చేసిందని తేలింది. ఇది యుకేకు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. మరోపక్క డెప్సాంగ్, గోగ్రాపోస్టు వంటి చోట్ల బలగాల
* భారత్పై నిఘాను పెంచిన చైనా..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
‘భారత్-చైనా మిత్రదేశాలు’ అంటూ చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ నిన్ననే ప్రకటించారు. అదే సమయంలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. భారత్పై నిఘాను చైనా మరింత పటిష్టం చేసిందని తేలింది. ఇది యుకేకు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. మరోపక్క డెప్సాంగ్, గోగ్రాపోస్టు వంటి చోట్ల బలగాల ఉపసంహరణపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.
భారత సరిహద్దుల్లో ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్,టార్గెట్ అక్విజేషన్ అండ్ రికానసన్స్ (ఐఎస్టీఏఆర్) వ్యవస్థను చైనా బలోపేతం చేస్తోందని యుకేకు చెందిన జానీస్ ఇన్ఫర్మేషన్ గ్రూప్ వెల్లడించింది. ఈ విషయం చైనా ప్రభుత్వ రంగ మీడియా సంస్థ సీసీటీవీలో వచ్చినట్లు పేర్కొంది. దీనిలో భారత్ సమీపంలోని షియావ్ పోస్టులో కొందరు సైనికులు టూ సెన్సర్ వ్యవస్థలను ఉపయోగిస్తున్న వీడియోలను ప్రసారం చేసింది. ఆ స్థావరం వద్ద నిర్మించిన బ్యారెక్స్ల్లో కూడా సెన్సర్లు, వాచ్టవర్లు ఉన్నట్లగా కనిపిస్తోంది. పాంగాంగ్ సరస్సు దగ్గర సైనిక ఉపసంహరణ జరిగిన కొన్ని వారాల తర్వాత ఈ విషయం బయటకొచ్చింది.
శరవేగంగా సరిహద్దుల్లో బుల్లెట్రైలు నిర్మాణం..
భారత సరిహద్దుల వెంట టిబెట్ అటానమస్ రీజియన్లో బుల్లెట్ రైలు నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోంది. లాసా నుంచి న్యాంగ్చి మధ్య 435 కిలోమీటర్ల మేరకు నిర్మించనున్న ఈ ప్రాజెక్టు పనులను 2014లో చేపట్టారు. ఇది ఈ ఏడాది జూన్ నాటికి పూర్తిగా అందుబాటులోకి వస్తుందని చైనాలో జరుగుతున్న నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్లో ప్రకటించారు. అరుణాచల్ ప్రదేశ్కు అత్యంత సమీపంలోకి ఉండే న్యాంగ్చిలో చైనాకు ప్రర్వత యుద్ధతంత్రంలో నిపుణులైన 52వ, 53వ బ్రిగేడ్లు ఈ పట్టణంలోనే ఉంటాయి. అత్యంతవసర సమయాల్లో దళాలను వేగంగా సరిహద్దులకు తరలించేలా వీటిని ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. 4.8 బిలియన్ డాలర్లతో నిర్మిస్తున్న ఈ రైల్వే లైన్ 75శాతం వంతెనలపై నుంచిగానీ, సొరంగాల్లో నుంచి కానీ నిర్మిస్తున్నారు.
దీంతోపాటు చైనా పశ్చిమ థియేటర్ కమాండ్ ప్రధాన స్థావరమైన చెంగ్డూను లాసాతో కలిపేలా సిచువాన్-టిబేట్ రైల్వే లైన్ పనులు వేగంగా జరుగుతున్నయి. భారత సరిహద్దుల వైపు ఉన్న చైనా సైనిక దళాలకు చెంగ్డూనే ప్రధాన స్థావరం. దీనిని 2030 నాటిపూర్తి చేయాలని చైనా భావిస్తోంది. 26స్టేషన్లతో నిర్మించే ఈ రైలు మార్గం వివాదాస్పద భారత సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉంటుంది. ఇది పూర్తి అయితే చైనా దళాలు చెంగ్డూ నుంచి లాసాకు కేవలం 13 గంటల్లో చేరుకోవచ్చు. అదే గతంలో దాదాపు 48 గంటల సమయం పట్టేది.
గల్వాన్లో భారత్ వంతెన..
మరోపక్క భారత్ కూడా సరిహద్దుల్లో కీలక నిర్మాణాలను పూర్తి చేసింది. తూర్పులద్దాక్లోని గల్వాన్ నదిపై భారత్ వ్యూహాత్మకమైన వంతెన నిర్మాణం ఇటీవలే పూర్తి చేసింది. చైనా దళాలు భారత్తో ఘర్షణ పడటానికి గల కారణాల్లో ఈ వంతెన నిర్మాణాన్ని ఆపటం కూడా ఒకటి. కానీ, భారత దళాలు ఏ మాత్రం లెక్క చేయకుండా వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశాయి. గల్వాన్, ష్యోక్ వంతెనల నదులు కలిసే చోట దీనిని నిర్మించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్