india vs china: శ్రీలంకలోభారత్ పాగా..!
శ్రీలంక నుంచి భారత్కు దూరం కేవలం వందల కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది.. అలాంటి దేశంలోని ఓడరేవుల్లో పాగా వేసింది..
ట్రింకోమలీ చమురు ట్యాంక్ల అభివృద్ధిలో భారత్కు వాటా..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
శ్రీలంక నుంచి భారత్కు దూరం కేవలం వందల కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది.. అలాంటి దేశంలోని ఓడరేవులో భారత్ పాగా వేసింది. ఓ దశలో చైనా (china) ఏకంగా సబ్మెరైన్లను కూడా శ్రీలంకలో నిలిపిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వాస్తవాధీన రేఖ వెంట.. పాకిస్థాన్లోని ఆక్రమిత కశ్మీర్, గ్వాదర్ పోర్టు.. శ్రీలంకలోని హంబన్టోటా పోర్టులో డ్రాగన్ దళాలు మోహరిస్తే సంక్షోభ సమయంలో భారత్ అన్ని వైపుల నుంచి ముప్పును ఎదుర్కొంటుంది. అందుకే భారత్ శ్రీలంకలో పరపతి పెంచుకోవడానికి చకచకా యత్నాలు చేస్తోంది. తాజాగా ‘చైనా బే’కు అత్యంత సమీపంలోని ట్రింకోమలీ చమురు ట్యాంకుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది. చైనా బే అనేది ట్రింకోమలీ రేవులోని ఓ భాగం పేరు. ఎక్కువగా చైనా నౌకలు వ్యాపారం చేసే ప్రదేశం కావడంతో ఆ పేరు వచ్చింది.
ట్రింకోమలీ చమురు ట్యాంకుల క్షేత్రంలో అభివృద్ధిలో భారత్కు వాటా..
శ్రీలంకలోని ట్రింకోమలీ ప్రపంచంలోనే మూడో అత్యంత లోతైన, పెద్ద పోర్టు. ఇక్కడికి సమీపంలోని ‘చైనాబే’ అనే ప్రాంతంలో.. ఒక్కోదానికి దాదాపు 12వేల కిలో లీటర్ల సామర్థ్యం ఉన్న 99 చమురు ట్యాంకులు ఉన్నాయి. వీటిని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిందూ మహాసముద్రంలో నౌకల్లో చమురు నింపేందుకు బ్రిటిష్ పాలకులు నిర్మించారు. ఈ పోర్టు అత్యంత వ్యూహాత్మక ప్రదేశంలో ఉంది. ఈ పోర్టులోని చమురు ట్యాంకుల అభివృద్ధి ప్రాజెక్టులో భారత్కు వాటా దక్కినట్లు శ్రీలంక ఇంధన శాఖ మంత్రి ఉదయ గమ్మన్పిల ప్రకటించారు. భారత్కు చెందిన ‘లంక ఐవోసీ’కు 49శాతం వాటా.. శ్రీలంకకు చెందిన ‘సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్’(సీపీసీ)కు 51శాతం వాటా లభించనుంది. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 99 ట్యాంకుల్లో 61 సంయుక్తంగా పునరుద్ధరిస్తారు. సీపీసీ 24.. లంక ఐవోసీ 14 అభివృద్ధి చేస్తాయి. వచ్చే 50 ఏళ్లపాటు సీపీసీ-లంక ఐవోసీ మధ్య ఒప్పందం అమల్లో ఉంటుంది. లంక ఐవోసీ అభివృద్ధి చేసే 14 ట్యాంకులలో శ్రీలంక ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుంది.
ఈ పోర్టు భారత్లోని చెన్నైకు అత్యంత సమీపంలో ఉంది. ఇక్కడ నౌకల రిఫ్యూయలింగ్ స్టేషన్ నెలకొల్పాలని లంకా ఐవోసీ భావిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇక్కడ 10లక్షల టన్నుల చమురు నిల్వచేసేలా ఏర్పాట్లు చేశారు.
35 ఏళ్ల తర్వాత పట్టాలెక్కి..
వాస్తవానికి ఈ ఒప్పందానికి 35 ఏళ్ల క్రితమే బీజాలు పడ్డాయి. అప్పట్లో ఎల్టీటీఈపై పోరుకు భారత్ సాయం చేసింది. ఆ సమయంలో భారత్ ఈ చమురు ట్యాంకుల క్షేత్రాన్ని అభివృద్ధి చేయడంపై శ్రీలంకతో చర్చించింది. నాటి లంక అధ్యక్షుడు జె.ఆర్.జయవర్థనే- భారత ప్రధాని రాజీవ్ గాంధీ మధ్య 1987 జులై 29 ఈ చమురు ట్యాంకుల క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలన్న నిర్ణయం జరిగింది. కానీ, ఆ తర్వాత దాదాపు 15 ఏళ్లపాటు శ్రీలంకలో అంతర్యుద్ధం కారణంగా ఇది వాస్తవరూపం ధరించలేదు. 2002లో నార్వే మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ జరిగింది. ఆ మరుసటి సంవత్సరమే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ శ్రీలంక విభాగాన్ని ‘లంక ఐవోసీ’పేరిట ప్రారంభించింది. ఈ చమురు ట్యాంకులను 35ఏళ్ల లీజుకు తీసుకొంది. ఏటా ఇందు కోసం లక్ష డాలర్లను చెల్లించేందుకు అంగీకరించింది.
2004లో పరిస్థితులు వేగంగా మారిపోయి.. భారత్-శ్రీలంక మధ్య దూరం పెరిగింది. మరోవైపు లంక ఐవోసీ వేగంగా విస్తరించి.. 200 రిటైల్ పెట్రోల్ పంపులను ప్రారంభించింది. మొత్తం 14 ట్యాంకులను, రెండు లూబ్ మిక్సింగ్ ట్యాంకులను, ట్రింకోమలీ ఓడరేవు జెట్టీ నుంచి ట్యాంకుల వరకు పైపులైన్ను పునరుద్ధరించింది. తొలుత ఇక్కడ పెట్టుబడులపై భారత్ పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ, 2010లో చైనా హంబన్టోటలో అడుగుపెట్టడంతో ప్రమాద ఘంటికలు మోగాయి. ఫలితంగా భారత్ ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పట్టాలు ఎక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2015లో ప్రధాని మోదీ శ్రీలంకలో పర్యటించారు. ఈ సందర్భంగా ట్రింకోమలీలో సంయుక్తంగా పెట్రోలియం హబ్ను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. కానీ, భారత్-శ్రీలంక మధ్య తరచూ చైనా ప్రోత్సాహంతో ఏదో ఒక వివాదం తలెత్తడంతో ఈ సంబంధాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి.
డ్రాగన్ బెదిరింపులకు భయపడి..
గతేడాది ప్రభుత్వ నిర్ణయాల కారణంగా శ్రీలంక ఆర్థిక పరిస్థితి భారీగా దెబ్బతింది. ఆహారం ధర గణనీయంగా పెరిగిపోయింది. 2022లో బాండ్ల చెల్లింపుల కోసం ఆ దేశానికి కనీసం 4.5 బిలియన్ డాలర్లు అవసరం. కానీ, విదేశీ రిజర్వులు 1.6 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. అదే సమయంలో చైనా నుంచి నాసిరకం సేంద్రియ ఎరువులను సరఫరా చేశారు. దీంతో వాటిని స్వీకరించేందుకు, చెల్లించేందుకు లంక నిరాకరించింది. కానీ, చైనా ఆర్బిట్రేషన్కు వెళతానని బెదిరించింది. దీంతో శ్రీలంక ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్సా హుటాహుటిన భారత్కు వచ్చి ఆర్థిక సాయం కోరారు. నాలుగు మార్గాల్లో సంబంధాలు పెంపొందించుకోవచ్చని ప్రతిపాదించారు. భారత్ నుంచి లైనాఫ్ క్రెడిట్పై చమురు కొనుగోలు, ఆహార కొనుగోలుకు లైనాఫ్ క్రెడిట్, ట్రింకోమలీ చమురు నిల్వ క్షేత్రాల అభివృద్ధి, భారత పెట్టుబడులకు మార్గం సుగమం చేయడం వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా డీల్ కొలిక్కి వచ్చినట్లు సమచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది. -
మణిపుర్లో మానవహక్కుల ఉల్లంఘన
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో జాతుల ఘర్షణ అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా పేర్కొంది. -
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరి భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నానని ఒలింపిక్ పతకం విజేత విజేందర్ సింగ్ పేర్కొన్నారు. -
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
తాము అధికారంలోకి వస్తే సంపద పునర్విభజనపై సర్వే చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఎక్స్ వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!