కొవిడ్ రోగి మృతి.. వైద్యులపై కర్రలతో దాడి!

కరోనా ఉగ్రరూపంతో దేశ రాజధాని నగరంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రోగుల తాకిడితో ఆస్పత్రుల్లో బెడ్‌లు కొరత, ఆక్సిజన్‌ కొరత ....

Published : 27 Apr 2021 23:08 IST

దిల్లీ: కరోనా ఉగ్రరూపంతో దేశ రాజధాని నగరంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రోగుల తాకిడితో ఆస్పత్రుల్లో బెడ్‌లు కొరత, ఆక్సిజన్‌ కొరత వంటి సమస్యలు వేధిస్తున్న వేళ అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనాతో మృతిచెందిన ఓ మహిళ బంధువులు ఆస్పత్రి వైద్య సిబ్బందిపై దాడికి దిగడం కలకలం రేపింది. ఈ ఘటన దిల్లీలోని సరిత విహార్‌లోని అపోలో ఆస్పత్రి వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కొవిడ్‌తో బాధపడుతున్న 62 ఏళ్ల మహిళను సోమవారం రాత్రి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఐసీయూ బెడ్‌ కోసం ఆమెను ఎమర్జెన్సీ ఏరియాలో ఉంచారు. అయితే, ఆమెకు ఐసీయూ బెడ్‌ దొరకకపోవడంతో మంగళవారం ఉదయం ప్రాణాలు కోల్పోయింది. దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు ఆస్పత్రి వైద్యులు, నర్సులపై దాడికి దిగారు. ఆస్పత్రి బయట కర్రలతో కొట్టి, పలు ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ ఘటనలో పలువురు సిబ్బంది గాయపడ్డారు. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని