శునకాలను పెంచుకుంటే పన్ను.. మధ్యప్రదేశ్ సిటీ కొత్త రూల్..!
పెంపుడు శునకాలపై పన్నులు విధించాలని మధ్యప్రదేశ్లోని సాగర్ నగరం నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తోంది.
భోపాల్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని సాగర్ నగరం కొత్త చట్టం తీసుకురాబోతోంది. శునకాలను పెంచుకునేవారిపై పన్నులు విధించనుంది. ప్రజల భద్రత, పరిశుభ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఈ తరహా పన్నులు విధించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
తాజాగా సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో శునకాల (Pet Dogs)ను పెంచుకునే యజమానులకు పన్ను (Tax) విధించడంపై నిర్ణయం తీసుకున్నారు. 48 మంది కౌన్సిలర్లు దీన్ని ఏకగీవ్రంగా ఆమోదించారు. త్వరలోనే న్యాయ నిపుణులతో చర్చించి దీనిపై విధివిధానాలను రూపొందించనున్నట్లు సాగర్ (Sagar City) మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ శుక్లా తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
‘‘నగరంలో కుక్కల (Dogs) దాడి ఘటనలు పెరుగుతున్నాయి. అంతేగాక, బహిరంగ ప్రదేశాల్లోకి పెంపుడు శునకాలను తీసుకొచ్చి మలమూత్ర విసర్జన చేయించడం వల్ల పరిసరాలు అపరిశుభ్రం అవుతున్నాయి. ఇలాంటి వాటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాం. శునకాలకు రిజిస్ట్రేషన్, వ్యాక్సినేషన్, కుక్కలను పెంచుకునేవారికి పన్నులు విధించాలని నిర్ణయించాం. ఆదాయం కోసం ఈ పన్నులు విధించట్లేదు. ప్రజల భద్రత, ఆరోగ్యం దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని శుక్లా వివరించారు.
అయితే, ఈ నిర్ణయాన్ని నగర వాసులు, జంతు ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది తప్పుడు నిర్ణయమని, వీధి శునకాలపై అధికారులు చర్యలు తీసుకోవాలే తప్ప.. పెంపుడు శునకాలపై పన్నులు విధించడం ఏ మాత్రం సరికాదని వారు విమర్శిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.