Mehul Choksi: కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అదృశ్యం.. అరెస్టు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. గత ఆదివారం ఆంటిగ్వాలో కన్పించకుండా
ఆరోపించిన ఛోక్సీ లాయర్.. భారత్కు అప్పగింతపై స్టే
డొమినికా: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అదృశ్యం.. అరెస్టు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. గత ఆదివారం ఆంటిగ్వాలో కన్పించకుండా పోయిన ఆయన రెండు రోజుల తర్వాత పక్కనే ఉన్న డొమినికా దీవిలో పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి డొమినికా తీసుకెళ్లారని ఛోక్సీ చెప్పినట్లు ఆయన తరఫున న్యాయవాది ఆరోపించారు. ఈ మేరకు డొమినికా కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఛోక్సీని భారత్కు అప్పగించడంపై అక్కడి న్యాయస్థానం స్టే విధించింది.
డొమినికా పోలీసుల అదుపులో ఉన్న ఛోక్సిని ఆయన న్యాయవాదుల బృందం కలిసేందుకు అనుమతినివ్వలేదు. అయితే చాలా సార్లు ప్రయత్నించిన తర్వాత వీడియో కాల్లో మాట్లాడేందుకు అంగీకరించినట్లు డొమినికాలోని ఆయన లాయర్ వేన్ మార్ష్ తెలిపారు. ‘‘ఛోక్సీని కలిసేందుకు అనుమతి ఇవ్వలేదు. ఆయనను తీవ్రంగా కొట్టినట్లు అన్పిస్తోంది. కళ్లు ఉబ్బిపోయాయి. ఒంటిపై కాలిన గాయాలు ఉన్నాయి. ఆంటిగ్వాలోని జాలీ హార్బర్ వద్ద నుంచి కొంతమంది వ్యక్తులు తనను బలవంతంగా లాక్కొని ఓ బోటులో డొమినికా తీసుకొచ్చారని ఆయన నాతో చెప్పారు. వారు భారత్, ఆంటిగ్వా పోలీసులు అయి ఉంటారని ఆయన అన్నారు’’ అని మార్ష్ చెప్పుకొచ్చారు.
ఆంటిగ్వాలో ఛోక్సీ ఉన్నట్టుండి అదృశ్యమవడం, డొమినికా పోలీసులు అరెస్టు చేయడం అనుమానాస్పదంగా ఉందని ఆయన లీగల్ టీం ఆరోపించింది. భారత్కు రప్పించేందుకు కావాలనే ఆయనను డొమినికా తీసుకెళ్లి ఉంటారని లాయర్లు అన్నారు. అయితే ఆయనకు భారత్ పౌరసత్వం లేదని, అలాంటప్పుడు ఆ దేశానికి ఎలా అప్పగిస్తారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అప్పగింతపై స్టే విధించింది. తదుపరి విచారణను డొమినికా కాలమానం ప్రకారం.. శుక్రవారం ఉదయం విచారించనున్నట్లు తెలుస్తోంది.
ఇంకా భారతీయుడేనా..
అయితే భారత్లో పౌరసత్వాన్ని రద్దు చేసుకునేందుకు ఛోక్సీ చేస్తున్న ప్రయత్నాలు ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. ఆయన ఇంకా భారతీయుడేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఛోక్సీ అప్పగింతపై తాము న్యాయపరంగా ముందుకు వెళ్తామని పేర్కొంటున్నాయి.
గత ఆదివారం సాయంత్రం ఛోక్సీ ఆంటిగ్వాలో అదృశ్యమైన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై ఇంటర్పోల్ ఎల్లో నోటీసులు జారీ చేసింది. అయితే రెండు రోజుల తర్వాత ఆంటిగ్వా పక్కనే ఉన్న డొమినికాలో ఓ బీచ్లో పత్రాలు విసిరేస్తూ కన్పించిన ఛోక్సీని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించడంతో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఛోక్సీని తిరిగి తమ దేశానికి పంపొద్దని, అటు నుంచే అటే భారత్కు అప్పగించమని ఆంటిగ్వా ప్రధాని కోరారు. పీఎన్బీ కేసులో ఛోక్సీలో రెడ్ కార్నర్ నోటీసు జారీ అవడంతో ఆయనను డొమినికా ప్రభుత్వం భారత్కు అప్పగించే వీలున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.