Trump సోషల్ మీడియా... అదో రకం!
Donald Trump Social media: కొత్త రకం సోషల్ మీడియా తీసుకొచ్చిన ట్రంప్
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ను అన్ని ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ కంపెనీలు నిషేధం విధించాయి. దీంతో ట్రంప్ సొంత సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకుంటున్నారని వార్తలొచ్చాయి. తాజాగా ట్రంప్ తన సోషల్ మీడియా నెట్వర్క్ను లాంచ్ చేశారు. చూడటానికి బ్లాగ్లా కనిపిస్తున్న ఈ పేజీ... ట్రంప్ అధికారిక వెబ్సైట్లో భాగంగానే ఉంది. మరి ఈ సోషల్ మీడియా పేజీలో ఎవరెవరు ఉంటారు అనే ప్రశ్న అక్కర్లేదు. ఎందుకంటే ఆయనొక్కడే అందులో పోస్టులు చేస్తుంటారు. మీకు నచ్చితే వాటిని అక్కణ్నుంచి మీ ఫేస్బుక్, ట్విటర్లో షేర్ చేసుకోవచ్చు. అన్నట్లు లైక్ కూడా కొట్టొచ్చు.
ట్రంప్ తన సోషల్ మీడయా పేజీకి ‘ఫ్రమ్ ది డెస్క్ ఆఫ్ డొనాల్డ్ జూ. ట్రంప్’ అని పేరు పెట్టుకున్నారు. నెటిజన్లు ఈ పేజీలో సైనప్ అయ్యి ఆయన పోస్టులను అలర్ట్ పెట్టుకోవచ్చు. దీని కోసం మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్, పూర్తి పేరు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ట్విటర్ షేర్ పని చేయడం లేదు. కేవలం ఫేస్బుక్ షేర్ మాత్రం పని చేస్తోంది. త్వరలో ట్విటర్ షేర్ కూడా తీసుకొస్తారట. అయితే మరి ఈ పోస్టుల్ని షేర్ చేస్తే ట్విటర్, ఫేస్బుక్ అంగీకరిస్తాయా అంటే... లేదనే చెబుతున్నారు నిపుణులు. తమ నిబంధనలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్న వెబ్సైట్/బ్లాగ్ పోస్టును సోషల్ మీడియా సంస్థలు అంగీకరించవు. కాబట్టి ట్రంప్ వెబ్సైట్ పోస్టులను ఎవరైనా షేర్ చేస్తే. వాటిని డిలీట్ చేసే అవకాశమూ ఉందన్నమాట.
ట్రంప్ సోషల్ మీడయా పేజీ అధికారికంగా మంగళవారమే లాంచ్ చేసినా... అందులో మార్చి 24 నుంచి పోస్టులు కనిపిస్తున్నాయి. కొత్త పోస్టుగా ట్రంప్ ఓ వీడియో పెట్టారు. అందులో చెప్పాలనుకున్న విషయాన్ని స్వేచ్ఛగా, రక్షణతో చెప్పండి అంటూ చెప్పుకొచ్చారు. ఈ పేజీ ద్వారా ట్రంప్ తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటారట. అయితే అదెలా జరుగుతుంది అనే విషయంలో ట్రంప్ మీడియా టీమ్ ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ట్రంప్ను ఫేస్బుక్ ఖాతాను తిరిగి అనుమతించాలా వద్దా అని ఫేస్బుక్ నిర్ణయం తీసుకోవడానికి ఒక రోజు ముందు ట్రంప్ ఇలా తన సోషల్ మీడియా పేజీని లాంచ్ చేయడం గమనార్హం.
యూ.ఎస్. క్యాపిటల్ మీద దాడి, ఆ తర్వాతి పరిణామాల గురించి ట్రంప్ చేసిన కొన్ని పోస్టుల వల్ల ఫేస్బుక్, ట్విటర్ ట్రంప్ సోషల్ మీడయా అకౌంట్ల మీద చర్య తీసుకున్నాయి. ట్రంప్ అకౌంట్లపై నిషేధం విధించాయి. అయితే ట్రంప్ ప్రస్తుతం లాంచ్ చేసిన వెబ్సైట్ను కాంపెయిన్ న్యూక్లియస్ రూపొందించింది. ఈ డిజిటల్ సర్వీసు సంస్థను ట్రంప్ మాజీ ప్రచార మేనేజర్ బ్రాడ్ పార్స్కేల్ స్థాపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు