Wine sales: వైన్ తాగడం ఆరోగ్యానికి హానికరమే.. కానీ!: మంత్రి రాజేశ్ తోపే
కొందరు వ్యక్తులు గంజాయి విక్రయాలపై సానుకూలంగా మాట్లాడుతున్నారని, కానీ గంజాయితో వైన్కు పోలికలేదన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు మరిన్ని నిధులు కేటాయించాలని........
జల్నా: మహారాష్ట్రలోని సూపర్ మార్కెట్లలో వైన్ విక్రయించాలన్న మంత్రివర్గ నిర్ణయాన్ని ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే సమర్థించుకున్నారు. వైన్ తాగడం ఆరోగ్యానికి హానికరమే అయినప్పటికీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం సూపర్ మార్కెట్లు, వాక్ ఇన్ స్టోర్లలో విక్రయించాలని నిర్ణయం తీసుకుందన్నారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. వైన్ని గంజాయితో పోల్చడం సరికాదన్నారు.
సూపర్ మార్కెట్లు, వాక్ ఇన్ స్టోర్లలో వైన్ అమ్మకాలకు అనుమతిస్తూ గత వారంలో మహారాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై భాజపా ఎంపీ ప్రతాప్ పాటిల్ చిఖిలార్ తీవ్ర విమర్శలు చేశారు. రైతులు గంజాయి సాగుకు కూడా ప్రభుత్వం అనుమతివ్వాలన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి స్పందిస్తూ.. వైన్ తాగడం ఆరోగ్యానికి హానికరమే అయినప్పటికీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. వైన్ తాగాలని ఎవరినీ ఆహ్వానించడంలేదన్నారు. రైతుల ఆర్థిక ప్రయోజనాలకు ఈ నిర్ణయం మంచిదేనని మంత్రి అభిప్రాయపడ్డారు.
కొందరు వ్యక్తులు గంజాయి విక్రయాలపై సానుకూలంగా మాట్లాడుతున్నారని, కానీ గంజాయితో వైన్కు పోలికలేదన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు మరిన్ని నిధులు కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వైద్య కళాశాలల ప్రారంభానికి అనుమతులు ఇవ్వాలని, నిధులు కేటాయించాలని కోరారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఇది కరోనా నుంచి మాత్రమే కాకుండా 21 ఇతర వ్యాధుల నుంచి కూడా రక్షణ కల్పిస్తున్నట్టు డబ్ల్యూహెచ్వో చేపట్టిన ఓ అధ్యయనంలో తేలిందన్నారు. మరోవైపు, మహారాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖా మంత్రి ఛగన్ భుజ్బల్ కూడా మద్యం విక్రయాలపై ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తూ నిన్న వ్యాఖ్యానించారు. రైతుల ప్రయోజనాల కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని భాజపా వ్యతిరేకిస్తోందంటూ మండిపడ్డారు.
సూపర్ మార్కెట్లు, వాక్ ఇన్ (నేరుగా వెళ్లి కొనుగోలు చేసే) దుకాణాల్లోనూ వైన్ అమ్మకాలకు అనుమతిస్తూ ‘షెల్ఫ్ ఇన్ షాప్’ విధానానికి రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. వైన్ అమ్మే వాక్ ఇన్ దుకాణాలకు 1000 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణం ఉండాలన్న షరతు విధించింది. వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లకు మంచి ధరలు లభించాలనే ఉద్దేశంతోనే మద్యం పాలసీని మార్చినట్టు మంత్రి నవాబ్ మాలిక్ చెప్పారు. పండ్ల ద్వారా తయారుచేసిన వైన్ విక్రయాలు పెరగటం ద్వారా రైతులకు గరిష్ఠ ధరలు లభిస్తాయని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ఈ నిర్ణయంపై భాజపా నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వం.. మహారాష్ట్రను ‘మద్య రాష్ట్ర’గా మార్చాలని చూస్తోందని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ విమర్శలు కురిపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్