Presidential Election: నూతన రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము.. యశ్వంత్ సిన్హాపై ఘన విజయం
రాష్ట్రపతి ఎన్నికల్లో(Presidential Election) ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ ఘన విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి.....
దిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో(Presidential Election) ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ ఘన విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై విజయం సాధించి భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. మొత్తం నాలుగు రౌండ్లలో లెక్కింపు జరగ్గా.. ఒక రౌండ్ మిగిలి ఉండగానే ఆమె 50శాతానికి పైగా ఓట్లు సాధించడం ద్వారా దేశంలో అత్యున్నత పీఠాన్ని దక్కించుకున్న తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర సృష్టించారు. ఈ ఎన్నికల్లో మొత్తంగా 4754 ఓట్లు పోలవ్వగా.. 53 ఓట్లు చెల్లుబాటు కానివిగా గుర్తించారు. చెల్లుబాటైన 4701 ఓట్లలో ద్రౌపదీ ముర్ము 2,824 ఓట్లు సాధించగా.. వాటి విలువ 6,76,803 అని రాజ్యసభ సెక్రటరీ జనరల్, రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ వెల్లడించారు. అలాగే, యశ్వంత్ సిన్హాకు 1,877 ఓట్లు రాగా.. వాటి విలువ 3,80,177. దీంతో ద్రౌపదీ ముర్ము నూతన రాష్ట్రపతిగా ఎన్నికైనట్టు ఆయన అధికారికంగా ప్రకటించారు.
- తొలి రౌండ్ ఫలితం: తొలి రౌండ్లో ఎంపీల ఓట్లు లెక్కించారు. మొత్తం 763మంది ఎంపీలు ఓటు వేయగా.. వీటిలో 15 ఓట్లు చెల్లలేదు. దీంతో 748 ఓట్లలో ద్రౌపదీ ముర్ముకు 540 ఓట్లు రాగా (విలువ 3,78,000).. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు (విలువ 1,45,600) వచ్చాయని రిటర్నింగ్ అధికారి, రాజస్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ తెలిపారు.
- రెండో రౌండ్ ఫలితం: రెండో రౌండ్లో ద్రౌపదీ ముర్ము భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. రెండో రౌండ్లో 10 రాష్ట్రాలను ఆంగ్ల అక్షర క్రమంలో తీసుకొని ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఆయా రాష్ట్రాల్లో ఓట్ల సంఖ్య 1138 కాగా.. వాటి విలువ 1,49,575. వీటిలో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకు 809 ఓట్లు (ఓట్ల విలువ 1,05,299) రాగా.. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 329 (ఓట్ల విలువ 44,276) వచ్చాయి.
- మూడో రౌండ్: మూడో రౌండ్ లెక్కింపు పూర్తయింది. ఈ రౌండ్లో కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు కవర్ అయ్యాయని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ వెల్లడించారు. ఈ రౌండ్లో 1333 ఓట్లు చెల్లుబాటు కాగా.. వీటి విలువ 1,65,664గా ఉన్నట్టు తెలిపారు. వీటిలో ద్రౌపదీ ముర్ముకు 812 ఓట్లు, యశ్వంత్ సిన్హాకు 521 ఓట్లు వచ్చినట్టు వెల్లడించారు.
- నాలుగు రౌండ్లలో కలిపి ఇలా.. ఈ ఎన్నికల్లో మొత్తంగా 4,754 ఓట్లు పోలవ్వగా.. 53 ఓట్లు చెల్లుబాటు కానివిగా గుర్తించారు. చెల్లుబాటైన 4,701 ఓట్లలో ద్రౌపదీ ముర్ము 2,824 ఓట్లు సాధించగా.. వాటి విలువ 6,76,803. అలాగే, యశ్వంత్ సిన్హాకు 1,877 ఓట్లు రాగా.. వాటి విలువ 3,80,177. నూతన రాష్ట్రపతిగా భారీ విజయం సాధించిన ద్రౌపదీ ముర్మును ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. దిల్లీలోని ఆమె తాత్కాలిక నివాసానికి వెళ్లిన ప్రధాని.. ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు చెప్పారు.
- ద్రౌపదీ ముర్ముకు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆమెకు అభినందనలు తెలిపారు. పార్టీలకు అతీతంగా ద్రౌపదీకి మద్దతు తెలిపిన ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ ఈ సందర్భంగా మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- ద్రౌపదీ ముర్ము స్వగ్రామం ఒడిశాలోని రాయ్రంగ్పూర్లో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. 20వేల మిఠాయిలు చేసి సిద్ధంగా ఉంచారు. ఫలితాలు వెలువడ్డాక ఆదివాసీ సంప్రదాయ నృత్యంతో విజయోత్సవ ఊరేగింపు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
- కౌంటింగ్ ఈ మధ్యాహ్నం 1.30గంటలకు పార్లమెంట్ హౌస్లో ప్రారంభమైంది. తొలి రౌండ్లో ఎంపీల ఓట్లు లెక్కించగా.. ఆ తర్వాత అక్షర క్రమంలో రాష్ట్రాల వారీగా ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు.
- ముర్ము విజయం సాధించాక దిల్లీ భాజపా విజయోత్సవ రోడ్షో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి రాజ్పథ్ వరకు రోడ్షో నిర్వహించనున్నారు. ఈ రోడ్షోలో భాజపా సీనియర్ నేతలు పాల్గొనే అవకాశం ఉంది. అలాగే, అన్ని రాష్ట్రాల్లో భాజపా నేతలు విజయోత్సవ వేడుకలకు సిద్ధమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు
వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!