ఎన్ఆర్ఐ కంపెనీలో ఉద్యోగుల భార్యలకూ వేతనాలు!
తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు యాజమాన్యాలు నెలనెలా జీతాలు ఇస్తుంటాయి. ఏటా బోనస్లు.. లాభాలు వచ్చినప్పుడు, ఉద్యోగి ప్రతిభ కనబర్చినప్పుడు ప్రోత్సాహకాలూ అందిస్తుంటాయి. కానీ, దుబాయ్లోని సంస్థ తమ ఉద్యోగులకే కాదు.. వారి భార్యలకు కూడా
ఇంటర్నెట్ డెస్క్: తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు యాజమాన్యాలు నెలనెలా జీతాలు ఇస్తుంటాయి. ఏటా బోనస్లు.. లాభాలు వచ్చినప్పుడు, ఉద్యోగి ప్రతిభ కనబర్చినప్పుడు ప్రోత్సాహకాలూ అందిస్తుంటాయి. కానీ, దుబాయ్లోని సంస్థ తమ ఉద్యోగులకే కాదు.. వారి భార్యలకు కూడా వేతనం ఇస్తామంటోంది. ప్రస్తుతం విధివిధానాలు రూపొందిస్తున్నామని, త్వరలో అమలు చేయనున్నట్లు వెల్లడించింది. వివరాళ్లోకి వెళ్తే..
కేరళకు చెందిన డాక్టర్ సోహన్ రాయ్.. కొన్నేళ్ల కిందట దుబాయ్లోని షార్జాకి వెళ్లి స్థిరపడ్డారు. ఎరిస్ అనే సంస్థను స్థాపించి అనతి కాలంలో ఎరిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీగా మార్చారు. ఈ గ్రూప్లో మెరైన్, ఇంజినీరింగ్, చమురు ఇలా 50కిపైగా కంపెనీలు ఉన్నాయి. అయితే, తన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల కుటుంబాల్లో ఉద్యోగం లేని భార్యలకు జీతం ఇవ్వాలని రాయ్ ఇటీవల నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేశారు. ఉద్యోగుల టేక్హోం జీతంలో 25 శాతానికి సమానమైన మొత్తాన్ని వారి భార్యలకు ‘హోం సాలరీ’గా ఇస్తామని వెల్లడించారు. జీతం ఒకటే కాదు.. ఉద్యోగులు పొందే ప్రోత్సాహకాలు, బోనస్, షేర్లపై 25 శాతం వారి భార్యలకు కేటాయిస్తామని చెప్పారు. అయితే సంస్థలో మూడేళ్లకు మించి పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుందని సంస్థ నిబంధన పెట్టింది.
సంస్థ సీఈవోగా వ్యవహరిస్తున్న రాయ్.. తన ఉద్యోగులను సొంత మనుషులుగా చూసుకుంటారు. సంస్థ షేర్లలో, వచ్చే లాభాల్లో ఉద్యోగులకు 50శాతం కేటాయిస్తారు. కరోనా, లాక్డౌన్ సమయంలోనూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యోగులను తొలగించలేదు. వారి జీతాలు తగ్గించలేదు. ఉద్యోగులు కరోనాను లెక్క చేయకుండా విధులు నిర్వర్తించడమే గొప్ప విషయంగా ఆయన చెబుతుంటారు. అయితే, ఈ క్రమంలో ఉద్యోగులు విధులను ఏ చింత లేకుండా నిర్వర్తిస్తున్నారంటే అందుకు వారి భార్యలే కారణమని రాయ్ నమ్ముతారు. ‘భర్త.. పిల్లల కోసం ఇంట్లో గృహిణులు పడే కష్టానికి పెద్దగా విలువ ఇవ్వరు. ఉద్యోగులకు వారాంతాల్లో సెలవులు ఉంటాయి. కానీ, గృహిణులకు అలాంటివేవి ఉండవు. వారి కష్టాన్ని గుర్తించాల్సిన అవసరముంది’అని ఎరిస్ సంస్థ సీఈవో అభిప్రాయపడ్డారు.
అందుకే తొలిసారి ఉద్యోగులతోపాటు ఉద్యోగుల భార్యలకు వేతనమిచ్చే ‘హోం సాలరీ’ పాలసీని తీసుకొచ్చామని రాయ్ తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగుల భార్యల వివరాలు సేకరిస్తున్నారట. ఎవరైతే ఉద్యోగం చేయట్లేరో వారి జాబితా తయారు చేసి త్వరలో జీతాలు ఇవ్వడం మొదలుపెడతామని చెప్పారు. సంస్థ ఉన్నంత వరకు ఈ పాలసీ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీంతో రాయ్ ఉదారతకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. గొప్ప మనసున్న వ్యక్తంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. పన్నెండేళ్ల కిందటే ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్ ఇచ్చే పాలసీని ఎరిస్ సంస్థ అమలు చేయడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్