ఎన్ఆర్ఐ కంపెనీలో ఉద్యోగుల భార్యలకూ వేతనాలు!
తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు యాజమాన్యాలు నెలనెలా జీతాలు ఇస్తుంటాయి. ఏటా బోనస్లు.. లాభాలు వచ్చినప్పుడు, ఉద్యోగి ప్రతిభ కనబర్చినప్పుడు ప్రోత్సాహకాలూ అందిస్తుంటాయి. కానీ, దుబాయ్లోని సంస్థ తమ ఉద్యోగులకే కాదు.. వారి భార్యలకు కూడా
ఇంటర్నెట్ డెస్క్: తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు యాజమాన్యాలు నెలనెలా జీతాలు ఇస్తుంటాయి. ఏటా బోనస్లు.. లాభాలు వచ్చినప్పుడు, ఉద్యోగి ప్రతిభ కనబర్చినప్పుడు ప్రోత్సాహకాలూ అందిస్తుంటాయి. కానీ, దుబాయ్లోని సంస్థ తమ ఉద్యోగులకే కాదు.. వారి భార్యలకు కూడా వేతనం ఇస్తామంటోంది. ప్రస్తుతం విధివిధానాలు రూపొందిస్తున్నామని, త్వరలో అమలు చేయనున్నట్లు వెల్లడించింది. వివరాళ్లోకి వెళ్తే..
కేరళకు చెందిన డాక్టర్ సోహన్ రాయ్.. కొన్నేళ్ల కిందట దుబాయ్లోని షార్జాకి వెళ్లి స్థిరపడ్డారు. ఎరిస్ అనే సంస్థను స్థాపించి అనతి కాలంలో ఎరిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీగా మార్చారు. ఈ గ్రూప్లో మెరైన్, ఇంజినీరింగ్, చమురు ఇలా 50కిపైగా కంపెనీలు ఉన్నాయి. అయితే, తన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల కుటుంబాల్లో ఉద్యోగం లేని భార్యలకు జీతం ఇవ్వాలని రాయ్ ఇటీవల నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేశారు. ఉద్యోగుల టేక్హోం జీతంలో 25 శాతానికి సమానమైన మొత్తాన్ని వారి భార్యలకు ‘హోం సాలరీ’గా ఇస్తామని వెల్లడించారు. జీతం ఒకటే కాదు.. ఉద్యోగులు పొందే ప్రోత్సాహకాలు, బోనస్, షేర్లపై 25 శాతం వారి భార్యలకు కేటాయిస్తామని చెప్పారు. అయితే సంస్థలో మూడేళ్లకు మించి పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుందని సంస్థ నిబంధన పెట్టింది.
సంస్థ సీఈవోగా వ్యవహరిస్తున్న రాయ్.. తన ఉద్యోగులను సొంత మనుషులుగా చూసుకుంటారు. సంస్థ షేర్లలో, వచ్చే లాభాల్లో ఉద్యోగులకు 50శాతం కేటాయిస్తారు. కరోనా, లాక్డౌన్ సమయంలోనూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యోగులను తొలగించలేదు. వారి జీతాలు తగ్గించలేదు. ఉద్యోగులు కరోనాను లెక్క చేయకుండా విధులు నిర్వర్తించడమే గొప్ప విషయంగా ఆయన చెబుతుంటారు. అయితే, ఈ క్రమంలో ఉద్యోగులు విధులను ఏ చింత లేకుండా నిర్వర్తిస్తున్నారంటే అందుకు వారి భార్యలే కారణమని రాయ్ నమ్ముతారు. ‘భర్త.. పిల్లల కోసం ఇంట్లో గృహిణులు పడే కష్టానికి పెద్దగా విలువ ఇవ్వరు. ఉద్యోగులకు వారాంతాల్లో సెలవులు ఉంటాయి. కానీ, గృహిణులకు అలాంటివేవి ఉండవు. వారి కష్టాన్ని గుర్తించాల్సిన అవసరముంది’అని ఎరిస్ సంస్థ సీఈవో అభిప్రాయపడ్డారు.
అందుకే తొలిసారి ఉద్యోగులతోపాటు ఉద్యోగుల భార్యలకు వేతనమిచ్చే ‘హోం సాలరీ’ పాలసీని తీసుకొచ్చామని రాయ్ తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగుల భార్యల వివరాలు సేకరిస్తున్నారట. ఎవరైతే ఉద్యోగం చేయట్లేరో వారి జాబితా తయారు చేసి త్వరలో జీతాలు ఇవ్వడం మొదలుపెడతామని చెప్పారు. సంస్థ ఉన్నంత వరకు ఈ పాలసీ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీంతో రాయ్ ఉదారతకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. గొప్ప మనసున్న వ్యక్తంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. పన్నెండేళ్ల కిందటే ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్ ఇచ్చే పాలసీని ఎరిస్ సంస్థ అమలు చేయడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒక్క ఘటనతో గృహ హింసను నిర్ధారించలేం
ఒకే ఒక్క ఘటన ఆధారంగా...అదీ అంత తీవ్రమైనది కాని పక్షంలో నిందితునిపై గృహ హింస నేరాన్ని మోపలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
డీప్ఫేక్ ఉచ్చులో ప్రియాంకా చోప్రా
డీప్ఫేక్ వీడియోలను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ రోజుకో నటి వీటి బారిన పడుతూనే ఉన్నారు. -
గుండెపోట్ల కలవరం.. 10 లక్షల మందికి సీపీఆర్ శిక్షణ
వయసుతో సంబంధం లేకుండా ఇటీవలి కాలంలో ఎక్కువ అవుతున్న గుండెపోటు మరణాలు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. -
భారత పార్లమెంటుపై దాడి చేస్తా
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారత్పై బెదిరింపులకు పాల్పడ్డాడు. -
మెహుల్ చోక్సీ దంపతులపై ఛీటింగ్ కేసు పునరుద్ధరణ
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, విదేశాలకు పరారైన వ్యాపారి మెహుల్ చోక్సీ, ఆయన భార్యకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. -
దేశ రక్షణ లక్ష్యంగా చట్టాల్లో మార్పులకు అవకాశముండాలి
అక్రమ వలసలు, హింసతో ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, ఈ విషయంలో దేశ రక్షణ లక్ష్యంగా చట్టాల సవరణకు ప్రభుత్వానికి విశాల దృక్పథముండేలా పరిస్థితులుండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
సుప్రీంకోర్టులో కేసుల లిస్టింగ్లో అసంబద్ధ విధానాలు
సుప్రీంకోర్టులో ఒక ధర్మాసనం ముందు విచారణకు లిస్టైన కేసులను అనూహ్యంగా మరో బెంచ్కు మారుస్తున్నట్లు సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దుష్యంత్ దవే ఆవేదన వ్యక్తం చేశారు. -
యునెస్కో జాబితాలో గర్బా నృత్యం
గుజరాత్ సంప్రదాయ నృత్యం గర్బాకు ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు లభించింది. -
పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే
కశ్మీర్ దుస్థితికి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన రెండు అతి పెద్ద తప్పిదాలే కారణమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. -
100కు పైగా మోసకారి వెబ్సైట్ల మూసివేత
చట్టవిరుద్ధ పెట్టుబడులకు మార్గం కల్పించడంతోపాటు పరిమిత కాల ఉద్యోగాల పేరుతో భారత్లో అభ్యర్థులను మోసగిస్తున్న 100కు పైగా వెబ్సైట్లను మూసివేసినట్లు కేంద్ర హోంశాఖ బుధవారం ప్రకటించింది. -
అయోధ్య విగ్రహ ప్రతిష్ఠాపనకు 7వేల మందికి ఆహ్వానం
ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అతిరథ మహారథులను రామాలయ ట్రస్టు ఆహ్వానిస్తోంది. -
అంబేడ్కర్కు ప్రధాని ఘన నివాళి
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం ప్రధాని మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. -
సంక్షిప్త వార్తలు
చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ను తిరిగి భూకక్ష్యలోకి విజయవంతంగా తీసుకువచ్చిన ఇస్రోకు అభినందనలు. -
వరద నుంచి తేరుకోని చెన్నై
మిగ్జాం తుపాను శాంతించినప్పటికీ చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సమస్య ఉన్న చోట నేవీ, ఎయిర్ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, గ్రేటర్ కార్పొరేషన్, పోలీసు, ఇతర విభాగాల సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. -
Ratan Tata: రిస్క్లేని పెట్టుబడి అంటూ.. రతన్ టాటా నకిలీ ఇంటర్వ్యూ ఇన్స్టాలో పోస్టు
రతన్ టాటా మాట్లాడినట్లు ఓ నకిలీ ఇంటర్వ్యూ ఇన్స్టాగ్రామ్లో వెలుగుచూసింది.


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్
-
Telangana New Ministers: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనుంది వీళ్లే..
-
Bapatla: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు
-
Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం