Dubai: తొలి కాగితరహిత ప్రభుత్వంగా దుబాయ్ రికార్డు!
పర్యావరణహితం కోసం ప్రపంచదేశాలు కాగితరహిత కార్యకలాపాలు సాగించేందుకు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచంలోనే తొలి కాగితరహిత ప్రభుత్వంగా దుబాయ్ ఎమిరేట్స్ నిలిచింది. తమ ప్రభుత్వంలో 100శాతం కాగిత రహిత కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఎమిరేట్స్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మొహ్మద్ బిన్
దుబాయ్: పర్యావరణహితం కోసం ప్రపంచదేశాలు కాగితరహిత కార్యకలాపాలు సాగించేందుకు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచంలోనే తొలి కాగితరహిత ప్రభుత్వంగా దుబాయ్ ఎమిరేట్స్ నిలిచింది. తమ ప్రభుత్వంలో 100శాతం కాగిత రహిత కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఎమిరేట్స్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మొహ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తుమ్ ప్రకటించారు. అంతర్గత, బహిర్గత లావాదేవీలు.. ఫైల్స్ బదిలీలు అన్నీ ఇప్పుడు కాగితం ఉపయోగించకుండా డిజిటల్గా చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా 350 మిలియన్ యూఎస్ డాలర్లు, 1.40లక్షల పని గంటలు ఆదా చేసినట్లు పేర్కొన్నారు.
‘ఈ లక్ష్యం సాధించడం ద్వారా దుబాయ్ నిత్య జీవితంలోని అన్ని అంశాలను డిజిటలైజ్ చేయడానికి ఒక కొత్త దశకు నాంది పలికినట్లుగా భావిస్తున్నాం. ఆవిష్కరణ, సృజనాత్మకత, భవిష్యత్తుపై దృష్టి సారించే ప్రయాణమిది’’అని యువరాజు షేక్ హమ్దాన్ వ్యాఖ్యానించారు. డిజిటల్ సేవల కోసం అక్కడి ప్రభుత్వం ‘దుబాయ్ నవ్’ యాప్ను రూపొందించింది. పౌరులకు ఇందులో 12 కేటగిరిల్లో 130 స్మార్ట్ సిటీ సేవలు అందుబాటులో ఉన్నాయి.
యునైటెడ్ అరబ్ ఎమరేట్స్(యూఏఈ) మొత్తం కాగితరహితంగా మార్చేందుకు ఐదు దశల విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొదట దుబాయ్ కాగితరహిత ప్రభుత్వంగా అవతరించింది. ఐదు దశలు పూర్తయ్యేసరికి యూఏఈలో ఉన్న అన్ని ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కాగితరహితంగా మారనున్నాయి.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు..!
భారత మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ప్రశంసలు కురిపించింది. -
270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘన.. యువతికి రూ.1.36 లక్షల జరిమానా
బెంగళూరుకు చెందిన ఓ మహిళ 270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. -
భారతీయుడు అడుగుపెట్టే వరకు జాబిల్లి యాత్రలు: ఇస్రో చీఫ్
Chandrayaan: చంద్రుడి ఉపరితలంపై భారతీయుడు అడుగు పెట్టేవరకు భారత జాబిల్లి యాత్రలు కొనసాగుతాయని ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. -
ప్రచారానికి తెర.. లోక్సభ ‘తొలి’ పోరుకు సర్వం సిద్ధం!
ఏడు విడతల్లో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా.. తొలి దశకు సంబంధించి ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడింది. -
మోదీ విమర్శలపై రాహుల్ గాంధీ క్లారిటీ
తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టత ఇచ్చారు. -
‘ఫుట్రెస్ట్పై బాలుడిని నిలబెట్టి’.. పేరెంట్స్ నిర్లక్ష్యంపై నెటిజన్ల ఆగ్రహం
నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు రోడ్లపై ఓ జంట తమ కుమారుడి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫుట్రెస్ట్పై బాలుడిని నిలబెట్టి ప్రయాణించిన వీడియో వైరల్గా మారింది. -
గగనతలంలో ‘సూర్యతిలకం’ వీక్షించి.. మోదీ భావోద్వేగం
PM Modi: అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్యతిలకం తనకు ఎంతో భావోద్వేగ క్షణం అని ప్రధాని మోదీ అన్నారు. -
‘రాహుల్, ప్రియాంక అమూల్ బేబీలు’.. అస్సాం సీఎం హిమంత వ్యంగ్యాస్త్రాలు
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
అమేఠీ నుంచి పోటీపై రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..?
అమేఠీ నుంచి పోటీపై రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు.. అది భాజపా ప్రశ్న అని అన్నారు. -
అయోధ్య బాలరాముడికి ‘సూర్యతిలకం’.. కనువిందు చేసిన అద్భుత దృశ్యం
Ayodhya Ram Mandir: శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై సూర్య భగవానుడు తిలకం దిద్దాడు. ఈ అపూర్వ ఘట్టాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. -
5 శతాబ్దాల నిరీక్షణ భాగ్యం.. దేశ ప్రజలకు ప్రధాని శ్రీరామనవమి శుభాకాంక్షలు
Shri Ram Navami: శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవమని గుర్తుచేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. -
అయోధ్య రాముడికి నేడు సూర్యతిలకం
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో ఈ ‘సూర్య’తిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. -
70 ఏళ్లలో తొలిసారి.. తుంగభద్ర క్రస్ట్ గేట్ల పటిష్ఠత పనులు
తుంగభద్ర జలాశయం క్రస్ట్ గేట్లను మరింత దృఢంగా మార్చే పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
ధూమపానంతో లోపాల పిల్లలు!
అనారోగ్యకర జీవనశైలితోపాటు ధూమపానం, మద్యపానం, ప్రాసెస్డ్ ఆహార వినియోగం, సెల్ఫోన్ విపరీతంగా వాడటం వంటి అలవాట్లతో శుక్రకణాల (స్పెర్మ్) డీఎన్ఏ దెబ్బతినే ప్రమాదం ఉందని దిల్లీలోని ఎయిమ్స్ వైద్య నిపుణులు పేర్కొన్నారు. -
మన ఓటింగ్ వ్యవస్థను తక్కువ చేయొద్దు
జనాభా తక్కువగా ఉన్న దేశాలతో మన ఎన్నికల ప్రక్రియను పోల్చడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బ్యాలెట్ ఓటింగ్ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావిస్తూ గతంలో రిగ్గింగ్ వంటి అక్రమాలు జరిగిన విషయం తెలుసునని పేర్కొంది. -
భారత ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నాం: జర్మనీ
భారత సార్వత్రిక ఎన్నికలను తాము ఆసక్తిగా గమనిస్తున్నట్లు జర్మనీ తెలిపింది. ప్రపంచంలోని ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ ప్రక్రియను గౌరవిస్తున్నట్లు పేర్కొంది. -
నేను అరవింద్ కేజ్రీవాల్ను.. ఉగ్రవాదిని కాదు
తిహాడ్ జైలులో అధికారులు, భాజపా తనతో ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలను ఉద్దేశించి మంగళవారం ఓ సందేశాన్ని పంపారు. -
మంచుగడ్డలపై యోగా
చైనాలో భారతీయుడి యోగాసనాలు విస్తృత ప్రాచుర్యం పొందుతున్నాయి. ఐక్యరాజ్య సమితి చైనా విభాగానికి నేతృత్వం వహిస్తున్న సిద్దార్థ ఛటర్జీ.. సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలో దట్టమైన మంచులో వేస్తున్న కఠినమైన యోగాసనాలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. -
పారిశ్రామిక మద్యంపై నియంత్రణ కేంద్రానిదే
పారిశ్రామిక మద్యంపై నియంత్రణాధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మంగళవారం స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల రీత్యా సంపూర్ణ అధికారం అంశాన్ని పారిశ్రామిక (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1951 ద్వారా పొందుపరిచారని వివరించారు. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో ఇద్దరు నిందితుల అరెస్ట్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి వారిని గుజరాత్లోని కుచ్ జిల్లా మాతా నో మద్ గ్రామంలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు..!
-
జగన్.. గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు: చంద్రబాబు
-
క్రూడాయిల్ దిగుమతుల బిల్లు తగ్గింది, కానీ..!
-
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా