Cyclone: తూర్పు తీరానికి తుపాను ముప్పు

తౌక్టే తుపాను ధాటికి దేశ పశ్చిమ తీరం అల్లాడిపోయింది. తీర రాష్ట్రాల్లో ఈ తుపాను సృష్టించిన బీభత్సాన్ని మరవకముందే.. మరో ముప్పు పొంచి చూస్తోంది. మే 26-27 తేదీల్లో మరో

Published : 19 May 2021 18:22 IST

దిల్లీ: తౌక్టే తుపాను ధాటికి దేశ పశ్చిమ తీరం అల్లాడిపోయింది. తీర రాష్ట్రాల్లో ఈ తుపాను సృష్టించిన బీభత్సాన్ని మరవకముందే.. మరో ముప్పు పొంచి చూస్తోంది. మే 26-27 తేదీల్లో మరో తుపాను తూర్పు తీరాన్ని తాకే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) బుధవారం వెల్లడించింది. మే 22న ఉత్తర అండమాన్‌ సముద్రం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తీర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది.

‘‘అల్పపీడనం ఏర్పడిన 72 గంటల్లో అది మరింత బలపడి తుపానుగా మారే అవకాశముంది. అది వాయువ్య దిశగా కదులుతూ మే 26 నాటికి పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలను తాకే అవకాశముంది’’ ఐఎండీ తుపాను హెచ్చరికల విభాగం వెల్లడించింది. తుపాను ప్రభావంతో అండమాన్‌ నికోబార్‌ దీవులు, ఒడిశా, బెంగాల్‌, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. 

సాధారణంగా రుతుపవనాల ఆగమనానికి ముందు ఏప్రిల్‌, మే నెలల్లో తూర్పు, పశ్చిమ తీరాల్లో తుపానులు ఏర్పడుతుంటాయి. గతేడాది మే నెలలో అంఫన్‌, నిసర్గ తుపానులు తీర రాష్ట్రాల్లో పెను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పశ్చిమాన తౌక్టే తుపాను విరుచుకుపడింది. తౌక్టే ధాటికి అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లో భారీ వర్షాలకు పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ముంబయి తీరంలో భారీ నౌకలు కొట్టుకుపోయాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని