Rapes in India: అత్యాచారాలకు మొబైల్‌ ఫోన్లే కారణం: గుజరాత్‌ హోం మంత్రి

భారత్‌లో అత్యాచారాలకు మొబైల్‌ ఫోన్‌లే కారణమని గుజరాత్‌ హోంమంత్రి హర్ష్‌ సంఘవి అన్నారు. మొబైల్‌ ఫోన్‌లోకి అశ్లీల వీడియోలు సులభంగా వచ్చేస్తున్నాయని......

Published : 03 Apr 2022 01:42 IST

అహ్మదాబాద్‌: భారత్‌లో అత్యాచారాలకు మొబైల్‌ ఫోన్‌లే కారణమని గుజరాత్‌ హోంమంత్రి హర్ష్‌ సంఘవి ఆరోపించారు. మొబైల్‌ ఫోన్‌లోకి అశ్లీల వీడియోలు సులభంగా వచ్చేస్తున్నాయని.. ఇవి కొందరిలో దుర్బుద్ధిని రేపుతున్నాయని పేర్కొన్నారు. భారత్‌లో అత్యాచారాలు భారీగా పెరిగిపోవడానికి ఇతర కారణాలను కూడా మంత్రి వివరించారు. తెలిసిన వ్యక్తులైన పొరుగిళ్లల్లో ఉండేవారు, కుటుంబ సభ్యులు సైతం ఇలాంటి నేరాలకు పాల్పడుతుండటం మరో ముఖ్య కారణంగా తెలిపారు. ఈ తరహా ఘటనలో ముఖ్యంగా చిన్నపిల్లలపై జరుగుతున్నట్లు వెల్లడించారు.

భారతదేశంలో అత్యాచారాలు ఎక్కువగా జరగడానికి మొబైల్ ఫోన్లు, తెలిసిన వ్యక్తులే కారణమని, ఇటీవలి సర్వేలో ఇది వెల్లడైనట్లు హర్ష్ సంఘవి స్పష్టం చేశారు. ‘అత్యాచారాలు సమాజానికి మాయని మచ్చగా నిలుస్తాయి. ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు శాంతి భద్రతలు సరిగా లేవని పోలీసులను నిందిస్తాం. కానీ ప్రతిసారి వారిని నిందించలేం. కుమార్తెపై ఓ తండ్రి అఘాయిత్యానికి పాల్పడితే.. తప్పు పోలీసులది కాదు. ఇందుకు కారణం ఆ తండ్రి చేతిలోని సెల్‌ఫోన్‌’ అని హోం మంత్రి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని