Gujarat: గుజరాత్ షెడ్యూల్ ఆలస్యంపై విమర్శలు.. ఈసీ వివరణ ఇదే
గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనలో తాము 100 శాతం నిష్పక్షపాతంగా వ్యవహరించామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ విషయంపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను ఖండించింది.
దిల్లీ: గుజరాత్ ఎన్నికల ప్రకటనలో ఎలాంటి పక్షపాతం చూపించలేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగానే ఈ ఎన్నికల తేదీలను ఆలస్యంగా ప్రకటించారన్న ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. ఈ మేరకు షెడ్యూల్ ఆలస్యానికి గల కారణాలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ గురువారం వివరణ ఇచ్చారు.
‘‘గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన విషయంలో కొందరు కావాలనే ప్రతకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. గుజరాత్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 18వ తేదీతో ముగియనుంది. అందువల్ల ఎన్నికలు నిర్వహించేందుకు కావాల్సిన సమయం ఉంది. శాసనసభ గడువు ముగిసే తేదీకి.. ఎన్నికల కౌంటింగ్ తేదీకి మధ్య 72 రోజుల వ్యవధి ఉంది. షెడ్యూల్ ప్రకటనకు మేం చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వాతావరణం, గత అసెంబ్లీ ఎన్నికల తేదీలు.. ఇలా ఎన్నో అంశాలను బ్యాలెన్స్ చేసుకోవాలి. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. గుజరాత్ ఎన్నికలకు నేటి నుంచి 38 రోజుల పాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. ఇది తక్కువ సమయమే అయినప్పటికీ దిల్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాగే ఉంది. షెడ్యూల్ ప్రకటన విషయంలో మేం 100శాతం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాం. అందుకు మేం గర్విస్తున్నాం’’ అని రాజీవ్ కుమార్ వివరణ ఇచ్చారు. అయితే, ఒకట్రెండు రోజులు ముందే షెడ్యూల్ ప్రకటించాలని నిర్ణయించినా.. మోర్బీ విషాద ఘటన కారణంగా కాస్త ఆలస్యమైందని ఆయన తెలిపారు. బుధవారం వరకు రాష్ట్రంలో సంతాప దినాలు ప్రకటించినందునే షెడ్యూల్ను నేడు విడుదల చేసినట్లు చెప్పారు.
సాధారణంగా రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాలు ఆరు నెలల వ్యవధిలో ముగుస్తుంటే గనుక.. ఆ రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ఓట్ల కౌంటింగ్ కూడా ఒకే రోజున చేపడతారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 8తో ముగుస్తుండగా.. గుజరాత్ శాసనసభ పదవీకాలం ఫిబ్రవరి 18తో పూర్తికానుంది. దీంతో ఈ రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని అంతా భావించారు. అయితే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు గత నెలలోనే తేదీలను ప్రకటించగా.. గుజరాత్ షెడ్యూల్ను కాస్త ఆలస్యం చేశారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే ఈ ఎన్నికల ప్రకటనను ఆలస్యం చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శించాయి. వీటిపైనే ఈసీ నేడు స్పందించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.