Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు ఈడీ షాక్‌!

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) షాక్‌ ఇచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం...

Updated : 05 Apr 2022 17:02 IST

ముంబయి: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) షాక్‌ ఇచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సంజయ్‌ రౌత్‌, ఆయన కుటుంబానికి సంబంధించిన అలీబాగ్‌లోని ఎనిమిది స్థలాలు, ముంబయిలోని దాదర్‌ సబర్బన్‌లో ఓ ఫ్లాట్‌ను అటాచ్‌ చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. రూ.1,034 కోట్ల విలువైన భూ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో ఆయనకు చెందిన ఆస్తుల్ని స్తంభింపజేసినట్టు పేర్కొన్నారు. ఇదే కేసుకు సంబంధించి మహారాష్ట్రకు చెందిన ఓ వ్యాపారవేత్త ప్రవీణ్‌ రౌత్‌ను ఫిబ్రవరిలోనే అరెస్టు చేసిన ఈడీ అధికారులు.. ఛార్జిషీట్‌ కూడా దాఖలు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని