Delhi Liquor Scam: ఒంగోలు వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఈడీ నోటీసులు

దిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liqour Scam) కేసులో ఒంగోలు వైకాపా మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే మాగుంట తనయుడు రాఘవరెడ్డి ఈ కేసులో అరెస్టయి జైలులో ఉన్న విషయం తెలిసిందే. 

Updated : 16 Mar 2023 16:47 IST

దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liqour Scam)లో వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే మాగుంట తనయుడు రాఘవరెడ్డి ఈ కేసులో అరెస్టయి జైలులో ఉన్న విషయం తెలిసిందే.

మద్యం కేసులో ఈరోజు అరుణ్‌ పిళ్లైని కోర్టులో హాజరు పరిచిన అధికారులు.. ఐదు రోజుల పాటు కస్టడీకి కోరారు. ఇతర నిందితులతో కలిపి పిళ్లైని ప్రశ్నించాల్సి ఉందని కోర్టుకు తెలపగా.. 3 రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. కొందరు నిందితులు, సాక్షులను కలిపి ప్రశ్నిస్తున్నామని చెప్పిన ఈడీ అధికారులు.. కొందరిని మళ్లీ విచారణకు పిలిచినట్టు కోర్టుకు తెలిపారు. ఈరోజు విచారణకు ఎమ్మెల్సీ కవిత రాలేదని ఈడీ కోర్టుకు సమాచారం ఇచ్చింది. పిళ్లై కస్టడీ పొడిగిస్తే శుక్రవారం బుచ్చిబాబుతో కలిసి ప్రశ్నిస్తామంది. ఈ కేసులోనే వైకాపా ఎంపీ శ్రీనివాసుల రెడ్డికి నోటీసులు ఇచ్చినట్టు న్యాయస్థానానికి ఈడీ తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని