Omicron: భారత్లో ఒక్కరోజే 16 ఒమిక్రాన్ కేసులు
ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తున్న ఒమిక్రాన్ మన దేశంలోనూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. భారత్లో ఒక్కరోజే అత్యధికంగా 16 కేసులు.....
57కి చేరిన మొత్తం కేసులు
ముంబయి: ప్రపంచాన్ని కలవర పెడుతున్న ఒమిక్రాన్ మన దేశంలోనూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. భారత్లో ఒక్కరోజే అత్యధికంగా 16 కేసులు వెలుగుచూశాయి. ఈరోజు ఉదయం దిల్లీలో నాలుగు, రాజస్థాన్లో నాలుగు చొప్పున కొత్త వేరియంట్ కేసులు రాగా.. తాజాగా మహారాష్ట్రలో మరో ఎనిమిది కేసులు నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. వీటిలో ముంబయి మహా నగరంలోనే ఏడు కేసులు రాగా.. వాసాయి విహార్ శివారులో మరో కేసు నమోదైంది. ఆరోగ్యశాఖ వెల్లడించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. వీరిలో ఎవరూ విదేశాలకు ప్రయాణించలేదని తెలుస్తోంది. తాజాగా నమోదైన కేసులతో కలిపి మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరగా.. భారత్లో ఆ సంఖ్య 57కి పెరిగింది.
కొత్తగా ఒమిక్రాన్ బారిన పడిన ఎనిమిది మందిలో ఒకరు దిల్లీ, మరొకరు బెంగళూరుకు ప్రయాణించినట్టు అధికారులు వెల్లడించారు. వీరందరిలో ఒక్కరు మాత్రమే టీకా తీసుకున్నట్టు సమాచారం. వీరంతా 24నుంచి 41 ఏళ్ల మధ్య వయసు కలిగినవారే. ముగ్గురిలో ఎలాంటి లక్షణాలు కనబడకపోగా.. ఐదుగురిలో మాత్రం స్వల్ప లక్షణాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఒమిక్రాన్ సోకినవారిలో ముగ్గురు మహిళలు కాగా.. ఐదుగురు పురుషులు ఉన్నారు. వీరిలో ఇద్దరు ఆస్పత్రిలో చేరగా.. ఆరుగురు హోం ఐసోలేషన్లో ఉన్నారు.
మహారాష్ట్రలో నమోదైన 28 కేసుల్లో ముంబయిలో 12, పింప్రీ చింద్వార్లో 10, పుణె మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెండు, కల్యాణ్ దొంబివలి, నాగ్పూర్ లాతూర్, వాసాయి విహార్లలో ఒక్కొక్కటి చొప్పున వెలుగుచూశాయి. ఇప్పటివరకు తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 19 ఒమిక్రాన్ క్రియాశీల కేసులు ఉన్నాయి. మరోవైపు, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్