YouTube Channels: నకిలీ వార్తల వ్యాప్తి.. 8 యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం వేటు
సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా నకిలీ వార్తలు వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది.
దిల్లీ: సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా నకిలీ వార్తలు వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తోన్న పలు యూట్యూబ్ ఛానళ్లపై ఇందులో భాగంగానే కేంద్రం నిషేధం విధించగా.. తాజాగా మరో 8 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఇందులో ఏడు భారత్కు చెందినవి కాగా.. ఒకటి పాకిస్థాన్కు చెందినదిగా కేంద్రం తెలిపింది. ఈ ఛానళ్లకు మొత్తగా 85లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. వీటిల్లో వచ్చిన వీడియోలను 114కోట్లకు పైగా మంది వీక్షించారు. దేశ భద్రత, విదేశీ వ్యవహారాలు, ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించిన అంశాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు గానూ, దేశంలో కొన్ని వర్గాల మధ్య ద్వేషం పెంచేలా వీడియోలు ప్రసారం చేస్తున్నందుకు గానూ ఈ ఛానళ్లను బ్లాక్ చేసినట్లు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తెలిపింది. భారత సాయుధ బలగాలు, జమ్మూకశ్మీర్కు వ్యతిరేకంగా ఈ ఛానళ్లు పలు నకిలీ వార్తలను ప్రసారం చేశాయని పేర్కొంది.
తాజా నిర్ణయంతో గతేడాది నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మొత్తంగా 102 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసింది. ఆన్లైన్లో ప్రామాణికమైన, విశ్వసనీయమైన, సురక్షిత వార్తల ప్రసారం ఉండేలా చూసుకోవడం తమ బాధ్యత అని కేంద్రం ఈ సందర్భంగా తెలిపింది. దేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని బలహీనపర్చేలా సామాజిక మాధ్యమాలు ప్రయత్నిస్తే వాటిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్