2 లక్షల కొత్త కేసుల్లో 81 శాతం ఆ పదిచోట్లే!
దేశంలో కరోనా ఉగ్రరూపం మరింత ఉద్ధృతమవుతోంది. బుధవారం ఒక్కరోజే 2లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఈ మహమ్మారి వ్యాప్తి చెందుతుండటంతో జనం తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు....
ఉగ్రరూపం చూపిస్తోన్న కొవిడ్
దిల్లీ: దేశంలో కరోనా ఉగ్రరూపం మరింత ఉద్ధృతమవుతోంది. బుధవారం ఒక్కరోజే 2 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఈ మహమ్మారి వ్యాప్తి చెందుతుండటంతో జనం తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు కఠిన ఆంక్షలు అమలవుతున్నా.. మరోవైపు టీకా పంపిణీ శరవేగంగా సాగుతున్నా.. వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతుండడం కలవరానికి గురిచేస్తోంది. బుధవారం ఒక్కరోజే 2 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా.. వీటిలో 80.76 శాతం కేవలం పది రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో అత్యధికంగా 58 వేలకు పైగా కేసులు రాగా.. ఆ తర్వాత యూపీలో 20 వేలు, దిల్లీలో 17 వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి.
కొండలా పెరిగిపోతున్న యాక్టివ్ కేసులు
కొత్త కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు కొండలా పేరుకుపోతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 14.71 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటిలో 67 శాతం కేవలం 5 రాష్ట్రాల్లోంచే కావడం గమనార్హం. మొత్తం యాక్టివ్ కేసుల్లో 41.69 శాతం ఒక్క మహారాష్ట్రలోనే కాగా.. ఆ తర్వాత ఛత్తీస్గఢ్లో 8.08 శాతం, యూపీ 7.6, కర్ణాటక 5.81, కేరళ 3.98 శాతం చొప్పున ఉన్నాయి. దేశంలో మిగతా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలన్నింటిలో కలిపి 32.86 శాతం యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. మహారాష్ట్ర, యూపీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 15 జిల్లాల్లో అత్యధిక క్రియాశీల కేసులు ఉన్నాయి.
తొమ్మిది చోట్ల మరణాల్లేవ్..
తాజాగా మరో 1038 మరణాలు నమోదవ్వగా.. అందులో 82.27 శాతం కేవలం 10 రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో నిన్న అత్యధికంగా 378 మంది కొవిడ్తో మృతి చెందగా.. ఆ తర్వాత ఛత్తీస్గఢ్లో 120 మంది, దిల్లీలో 104 మంది చొప్పున ప్రాణాలు విడిచారు. దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు.
మరోవైపు దేశంలో 89వ రోజూ వ్యాక్సిన్ పంపిణీ వేగంగా జరిగింది. నిన్న ఒక్కరోజే 33 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. వీటిలో 28,77,473 మందికి తొలి డోసు అందించగా.. 4,36,375 మందికి రెండో డోసు టీకాను అందించారు. దేశ వ్యాప్తంగా 11,44,93,238 డోసుల టీకా పంపిణీ చేసినట్టు కేంద్రం వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.