Chhattisgarh: ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh), కర్ణాటక(Karnataka) రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి 16 మంది మృతి చెందారు. 

Published : 24 Feb 2023 12:22 IST

భాటపరా: చత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని ​భాటపరాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు- వ్యాన్‌​ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. మరో పదిమందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. 

కర్ణాటకలో ఐదుగురు మృతి: 

మరోవైపు కర్ణాటక(Karnataka) ధార్వాఢలోనూ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ -కారు ఢీకొని ఐదుగురు మృత్యువాత పడ్డారు. వారిలో ఒక చిన్నారి ఉంది.  నలుగురు గాయపడ్డారు. గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులంతా ధార్వాడలోని  సమీపగ్రామ వాసులని పోలీసులు వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని