దుబాయ్- భారత్‌ విమానాలు తాత్కాలిక రద్దు

దేశంలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో దుబాయ్‌- భారత్‌ మధ్య విమాన రాకపోకలను ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్‌ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు

Published : 23 Apr 2021 01:05 IST

దుబాయ్‌: దేశంలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో దుబాయ్‌- భారత్‌ మధ్య విమాన రాకపోకలను ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్‌ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆదివారం (ఏప్రిల్‌ 25) నుంచి 10 రోజుల పాటు సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఆ తరువాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. భారత్‌పై ఇప్పటికే బ్రిటన్‌ ప్రయాణ ఆంక్షలు విధించిన కొద్దిరోజులకే ఎమిరేట్స్‌ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఫ్రాన్స్‌ సైతం భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు 10 రోజుల క్వారంటైన్‌ విధిస్తామని ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు