Encounter: లష్కరే కమాండర్‌ హతం

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.....

Updated : 23 Feb 2024 19:56 IST

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతిచెందిన వారిలో పాకిస్థాన్​కు చెందిన లష్కరే తొయిబా కమాండర్ ఐజాజ్ అలియాస్ అబూ హురైరా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా బలగాలు నిర్భంద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రత దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. మరింత మంది ముష్కరులు ఉన్నారన్న అనుమానంతో గాలింపు కొనసాగుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని