లద్దాఖ్‌లో బలగాలు  మోహరించి ఉన్నాయి..

లద్దాక్‌లో సరిపడా బలగాలు మోహరించి ఉన్నాయని ఆర్మీచీఫ్‌ ఎం.ఎం.నరవాణే తెలిపారు.

Published : 20 May 2021 19:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: లద్దాఖ్‌లో సరిపడా బలగాలు మోహరించి ఉన్నాయని ఆర్మీచీఫ్‌ ఎం.ఎం.నరవాణే తెలిపారు. చైనాతో జరుగుతున్న సైనిక ఉద్రిక్త పరిస్థితి చర్చలతో పరిష్కారం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా-భారత్‌ మధ్య చర్చలు  కొనసాగుతన్నాయని  ఆయన వివరించారు. మరో 60వేల మంది వరకు జవాన్లను మోహరించి ఉంచామని వెల్లడించారు. ఇరు దేశాలు దళాలు పరస్పరం ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడకుండా  బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు. ‘‘ఇది ప్రతి ఏటా జరిగే శిక్షణ కార్యక్రమమే. ఈ సమయంలో మావారంతా శిక్షణ శిబిరానికి వస్తారు. చైనా దళాలు కూడా వారి శిక్షణ శిబిరాలకు వస్తాయి. కానీ, మేము ఇప్పటికే డిస్‌ ఎంగేజ్‌ అయిన ప్రాంతాలకు వెళ్లం. ఇరు పక్షాలు ఈ ఒప్పందాన్ని గౌరవిస్తాయి’’ అని నరవాణే పేర్కొన్నారు. 

కొన్ని నెలల క్రితమే భారత్‌-చైనా దళాలు పాంగాంగ్‌ సరస్సు వద్ద నుంచి వెనుదిరిగాయి. కానీ, గాగ్రా పోస్ట్‌, హాట్‌స్ప్రింగ్స్‌, దెమ్‌చోక్‌ ప్రాంతాల్లో మాత్రం కొనసాగుతున్నాయి. అంతేకాదు అత్యంత వ్యహాత్మకమైన ప్రాంతమైన డెప్సాంగ్‌లో  భారత దళాలు పెట్రోలింగ్‌ నిర్వహించకుండా అడ్డుకొంటున్నాయి. దీంతోపాటు ఈ ప్రాంతాలకి సమీపంలోకి శిబిరాల్లో అత్యధునిక ఆయుధాలను మోహరిస్తున్నాయి. ఎల్‌ఏసీకి వేగంగా బలగాలను తరలించేందుకు అవసరమైన రోడ్లు, ట్రూప్స్‌ షల్టర్లు,హెలీప్యాడ్లు, క్షిపణి వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నాయి. దీనిపై నరవాణే స్పందిస్తూ.. తామకు చైనాకు ఏమాత్రం తగ్గకుండా మోహరింపులు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.  

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని