
Modi: క్రిప్టో కరెన్సీ తప్పుడు చేతుల్లోకి వెళ్లకూడదు.. అది మన యువతకు ప్రమాదం
‘సిడ్నీ డైలాగ్’ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగం
దిల్లీ: క్రిప్టో కరెన్సీపై దేశాలన్నీ కలిసి పనిచేయాలని, అది అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ‘ది సిడ్నీ డైలాగ్’ సదస్సులో మోదీ వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఇండియా టెక్నాలజీ: ఎవల్యూషన్ అండ్ రివల్యూషన్’’ అనే అంశంపై ప్రధాని కీలక ప్రసంగం చేశారు.
‘‘మనం ఇప్పుడు కీలకమైన మార్పులు జరిగే దశలో ఉన్నాం. ఈ డిజిటల్ శకం మన చుట్టూ ఉన్న ప్రతిదాన్నీ మార్చేస్తోంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలకు కొత్త అర్థాలు చెబుతోంది. సౌభ్రాతృత్వం, పాలన, విలువలు, చట్టం, హక్కులు, భద్రత తదితర అంశాలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. అంతర్జాతీయ పోటీ, అధికారం, నాయకత్వానికి కొత్త రూపు తెస్తోంది. అభివృద్ధి, సంపదకు అవకాశాలు కల్పిస్తోంది. అయితే, ఇదే సమయంలో మనం కొత్త ప్రమాదాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. నేటి తరంలో టెక్నాలజీ, డేటా నూతన ఆయుధాలుగా మారుతున్నాయి. ప్రజాస్వామ్యానికి అతిపెద్ద బలం పారదర్శకత. దీన్ని స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది’’ అని మోదీ తెలిపారు.
ఈ సందర్భంగా క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడుతూ.. ‘‘దీనిపై ప్రజాస్వామ్య దేశాలన్ని సమష్టిగా పనిచేయాల్సిన ఆవశక్యత చాలా ఉంది. ఇది తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. లేదంటే అది మన యువతను నాశనం చేసే ప్రమాదం ఉంది’’ అని తెలిపారు. అనంతరం భారత సాంకేతికత గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ప్రపంచంలోనే మూడో అతిపెద్ద, వేగంగా అభివృద్ది చెందుతోన్న పర్యావరణ వ్యవస్థ భారత్ది. ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రజా సమాచార మౌలిక వ్యవస్థలను మేం నిర్మిస్తున్నాం. ఆరు లక్షల గ్రామాలను ఇంటర్నెట్తో అనుసంధానం చేసే మార్గంలో ఉన్నాం. టెక్నాలజీని ఉపయోగించుకునే వంద కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయగలిగాం’’ అని మోదీ చెప్పుకొచ్చారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
India vs England: ఇంగ్లాండ్తో తొలి టీ20.. టాస్ గెలిచిన టీమిండియా
-
Technology News
Google Chrome: క్రోమ్ యూజర్లకు జీరో-డే ముప్పు.. బ్రౌజర్ను అప్డేట్ చేశారా?
-
World News
Monkeypox: 59 దేశాలకు పాకిన మంకీపాక్స్.. కేసులెన్నంటే?
-
Movies News
Murali Mohan: ‘గాడ్ ఫాదర్’లో ఆ లుక్ కావాలని చిరంజీవి అడిగారు: మురళీ మోహన్
-
India News
Lalu Prasad Yadav: కదలికలు లేని స్థితిలో లాలూ.. తేజస్వీ యాదవ్ వెల్లడి
-
World News
Boris Johnson: ప్రపంచంలోనే ఉత్తమ జాబ్ వదులుకోవడం బాధగా ఉంది!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- Naga Chaitanya: నువ్వే నాకు ప్రేమించడం నేర్పించావ్.. చై ఎమోషనల్ పోస్ట్
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- Elon Musk: ఉద్యోగితో మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మస్క్?
- Nagababu: భీమవరం సభలో చిరంజీవి తప్ప మిగిలిన వారి నటన అద్భుతం: నాగబాబు ట్వీట్
- పాఠాలు చెప్పలేదని.. రూ.24లక్షల జీతం తిరిగిచ్చేసిన ప్రొఫెసర్
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్.. ఆయన గురించి తెలుసా?
- IND vs ENG : ధనాధన్ వేళాయె..
- Chandrababu: చంద్రబాబు వేలికి ప్లాటినం ఉంగరం.. దాని వెనక కథేంటి?