ప్రాణాంతక ‘సూపర్బగ్’ ఆనవాళ్లు గుర్తింపు..!
ఔషధాలను తట్టుకునే సామర్థ్యమున్న ‘సూపర్బగ్’గా పిలిచే బ్యాక్టీరియా ఆనవాళ్లు భారత్ తీరంలో తొలిసారిగా బయటపడ్డాయి.
మరో మహమ్మారి ముప్పు ఉందంటున్న శాస్త్రవేత్తలు
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ మహమ్మారితో వణికిపోతున్న ప్రపంచ దేశాలకు మరో మహమ్మారి రూపంలో ముప్పు పొంచి ఉందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఔషధాలను తట్టుకునే సామర్థ్యమున్న ‘సూపర్బగ్’గా పిలిచే బ్యాక్టీరియా ఆనవాళ్లు భారత్ తీరంలో తొలిసారిగా బయటపడ్డాయి. అండమాన్ దీవుల్లో గుర్తించిన ఈ సూపర్బగ్ ఆనవాళ్లు, రానున్న రోజుల్లో మరో మహమ్మారికి దారితీసే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పరిశోధనా పత్రం ఎంబయో జర్నల్లో ప్రచురితమైంది.
కరోనా మహమ్మారి విజృంభణ వేళ ఔషధాలకు లొంగని సీ.ఆరిస్ (క్యాండిడా ఆరిస్) అనే బ్యాక్టీరియా ఆనవాళ్లను తొలిసారిగా అండమాన్ దీవుల్లో గుర్తించినట్లు తాజా నివేదిక వెల్లడించింది. సూపర్బగ్గా పిలిచే ఈ ప్రాణాంతక బ్యాక్టీరియాను కనుక్కోవడం ఓ మైలురాయిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అదే సమయంలో, రానున్న రోజుల్లో ఈ సుపర్బగ్ మహమ్మారిగా విజృంభించే ప్రమాదమూ లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులకు ఈ సూపర్బగ్ తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తున్నట్లు ఇప్పటివరకు వచ్చిన నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, సాధారణ వాతావరణంలో వీటి మూలాలు బయటపడనప్పటికీ.. ఇది మానవులకు ఎలా సోకుతుందనే విషయం ఇప్పటికీ మిస్టరీగా మిగిలినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అండమాన్ తీరంలో ఆనవాళ్లు..
సూపర్బగ్కు సంబంధించిన అధ్యయనాన్ని యూనివర్సిటీ ఆఫ్ దిల్లీకి చెందిన డాక్టర్ అనురాధా చౌధరీ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం చేపట్టింది. పరిశోధనలో భాగంగా, అండమాన్ దీవుల్లోని దాదాపు ఎనిమిది ప్రాంతాల నుంచి 48 ఇసుక, నీటి నమూనాలను సేకరించారు. అక్కడి ఇసుక, రాతి బీచ్లు, చిత్తడి నేలలు, మడ అడవుల నుంచి ఈ నమూనాలను సేకరించి పరీక్షించారు. మానవులు తిరగని క్షార స్వభావం కలిగిన నేలలతో పాటు మానవుల తాకిడి ఎక్కువగా ఉండే బీచ్ల సేకరించిన ఈ నమూనాలలో సీ.ఆరిస్ను వేరుచేసి పరీక్షించారు. క్షార స్వభావ నేలలతో పోలిస్తే మానవులు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో కనిపించిన సీ.ఆరిస్.. ఔషధాలకు లొంగనిదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, ఈ సూపర్బగ్ అండమాన్లోనే జీవించి ఉంటుందనే విషయం రుజువు కాలేదని స్పష్టంచేశారు. మానవుల ద్వారా ఈ సూక్ష్మజీవులు (మైక్రోబ్స్) ఎక్కడ నుంచైనా రావొచ్చని, ముఖ్యంగా మానవుల తాకిడి ఎక్కువగా ఉండే బీచ్లలో ఇది సాధ్యమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
లక్షణాలు..?
జ్వరం, తీవ్ర చలి వంటి లక్షణాల కంటే ముందు సూపర్బగ్ వల్ల వచ్చే లక్షణాలను అంత తేలికగా గుర్తించలేము. వాటిని తగ్గించేందుకు ఔషధాలు వాడినప్పటికీ అవి తగ్గే అవకాశం తక్కువ. ఒక్కోసారి తీవ్రత ఎక్కువై ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. సూపర్బగ్గా పిలిచే ఈ క్యాండిడ్ ఆరిస్ సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశించే ముందు కొంతసమయం పాటు చర్మంపై జీవిస్తుంది. ఇది రక్తం ద్వారా శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఇది ప్రమాదకరమైన ‘సెస్పిస్’కు దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. ఔషధాలకు లొంగని గుణమున్న ఈ సూక్ష్మజీవులను అదుపుచేయడం కష్టమని అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) కూడా చెబుతోంది. దీంతో ప్రజారోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల జాబితాలో 2019లో సీడీసీ చేర్చింది. ఆసుపత్రి వాతావరణంలో ఇది ఎక్కువ కాలం మనుగడ సాధిస్తుందని వెల్లడైనప్పటికీ, సాధారణ వాతావరణంలో ఈ సూపర్బగ్ను ఇప్పటివరకు గుర్తించలేదు.
మిస్టరీగానే సుపర్బగ్ వ్యాప్తి..
ప్రాణాంతకమైందిగా భావిస్తున్న ఈ సూపర్బగ్ ఎలా వ్యాపిస్తోందన్న విషయం మిస్టరీగా మిగిలింది. అయితే, వాతావరణ మార్పుల కారణంగా ఇది వ్యాపిస్తుందని పరిశోధకులు ఇది వరకు అంచనా వేశారు. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఈ ఫంగస్ మానవులకు సోకుతున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మొట్టమొదటి సారిగా 2009 సంవత్సరంలో ఈ సూపర్బగ్ను జపాన్లోని ఓ రోగిలో గుర్తించారు. బ్రిటన్లోనూ ఈ సూక్ష్మజీవి ఆనవాళ్లు బయటపడ్డాయి. అక్కడి ప్రజారోగ్య విభాగం నివేదిక ప్రకారం, 2019 నాటికి బ్రిటన్లో దాదాపు 270 మందిలో దీన్ని గుర్తించగా వీరిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలకు సూపర్బగ్ కారణమని చెప్పడానికి ఆధారాలు మాత్రం లేవని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఫంగస్ ఎక్కడ నుంచి వస్తోందన్న విషయం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిందని అమెరికాలోని జాన్స్హాప్కిన్స్ బ్లూమ్బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కు చెందిన డాక్టర్ ఆర్టురో క్యాసడేవాల్ పేర్కొన్నారు. ఈ సూపర్బగ్పై తదుపరి పరిశోధనలకు తాజా అధ్యయనం దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే, కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ, రానున్న రోజుల్లో ఇతర మహమ్మారుల ముప్పుపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ సూపర్బగ్ ఆనవాళ్లు ఉన్నట్లు ధ్రువీకరించినట్లయితే, వీటిపై మ్యాపింగ్ చేయడం ఇప్పటి నుంచే ప్రారంభించాలని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
Sunetra Pawar: బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25 వేల కోట్ల బ్యాంకు స్కామ్ కేసులో క్లీన్ చిట్ లభించింది. -
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
Viral video: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం