Ukraine Crisis: 219 మంది విద్యార్థులతో భారత్‌కు బయల్దేరిన విమానం

రొమేనియా సరిహద్దులకు చేరుకున్న 219 మందితో తొలి ఎయిర్​ ఇండియా విమానం ముంబయికి బయల్దేరినట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వెల్లడించారు......

Updated : 26 Feb 2022 16:55 IST

దిల్లీ: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ముమ్మర ప్రయత్నాల్లో పురోగతి సాధిస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​ పేర్కొన్నారు. రొమేనియా సరిహద్దులకు చేరుకున్న 219 మందితో తొలి ఎయిర్​ ఇండియా విమానం అక్కడినుంచి ముంబయికి బయల్దేరినట్లు ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. అందరినీ సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు అహర్నిశలు పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ అంశాలను స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నానని మంత్రి అన్నారు. భారతీయుల తరలింపులో సహకారం అందించిన రొమేనియా విదేశాంగ శాఖ మంత్రి బోగ్దాన్​ అరెస్కూకు జైశంకర్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

భారతీయులకు సహాయం అందిస్తున్నాం

ఉక్రెయిన్​ నుంచి తప్పించుకొని తమ దేశానికి చేరుకున్న భారతీయులకు సహాయం చేస్తున్నామని భారత్​లోని పోలండ్​ రాయబారి ఆడమ్​ బురాకౌస్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్​పై దాడిని పోలండ్​తో పాటు యూరోపియన్​ యూనియన్​ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయన్నారు. పోలండ్​, ఇతర దేశాలు ఉక్రెయిన్​కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాని తెలిపారు. ఐరోపా సమాఖ్య, ఇతర సంస్థలు కూడా రష్యాపై ఆంక్షలు విధించాయన్నారు. ఉక్రెయిన్​పై రష్యా తీవ్ర దాడులు తమ పౌరులకు కూడా పెద్ద సమస్యేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్​ నుంచి తప్పించుకొని తమ దేశానికి చేరుకున్న భారతీయులకు సహాయం చేస్తున్నామని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని