Ukraine Crisis: 219 మంది విద్యార్థులతో భారత్కు బయల్దేరిన విమానం
రొమేనియా సరిహద్దులకు చేరుకున్న 219 మందితో తొలి ఎయిర్ ఇండియా విమానం ముంబయికి బయల్దేరినట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వెల్లడించారు......
దిల్లీ: ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ముమ్మర ప్రయత్నాల్లో పురోగతి సాధిస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. రొమేనియా సరిహద్దులకు చేరుకున్న 219 మందితో తొలి ఎయిర్ ఇండియా విమానం అక్కడినుంచి ముంబయికి బయల్దేరినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అందరినీ సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు అహర్నిశలు పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ అంశాలను స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నానని మంత్రి అన్నారు. భారతీయుల తరలింపులో సహకారం అందించిన రొమేనియా విదేశాంగ శాఖ మంత్రి బోగ్దాన్ అరెస్కూకు జైశంకర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
భారతీయులకు సహాయం అందిస్తున్నాం
ఉక్రెయిన్ నుంచి తప్పించుకొని తమ దేశానికి చేరుకున్న భారతీయులకు సహాయం చేస్తున్నామని భారత్లోని పోలండ్ రాయబారి ఆడమ్ బురాకౌస్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్పై దాడిని పోలండ్తో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయన్నారు. పోలండ్, ఇతర దేశాలు ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాని తెలిపారు. ఐరోపా సమాఖ్య, ఇతర సంస్థలు కూడా రష్యాపై ఆంక్షలు విధించాయన్నారు. ఉక్రెయిన్పై రష్యా తీవ్ర దాడులు తమ పౌరులకు కూడా పెద్ద సమస్యేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ నుంచి తప్పించుకొని తమ దేశానికి చేరుకున్న భారతీయులకు సహాయం చేస్తున్నామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం