Ambani case: ప్రదీప్ ఆదేశాలతోనే రంగంలోకి హంతకులు..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి బెదిరింపుల కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాక్ష్యాలను మాయం చేసేందుకు ఒకప్పటి ఎన్కౌంటర్ స్పెషలిస్టులు పరస్పరం సహకరించుకొన్నారని
ఆంటిలియా కేసులో కొత్త మలుపులు
ఇంటర్నెట్డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి బెదిరింపుల కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాక్ష్యాలను మాయం చేసేందుకు ఒకప్పటి ఎన్కౌంటర్ స్పెషలిస్టులు పరస్పరం సహకరించుకొన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ నిర్ధరణకు వచ్చింది. వీరిద్దరి కనుసన్నల్లోనే అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు పెట్టిన కారును ఉంచడం, కీలక సాక్షి మన్సుఖ్ హిరేన్ హత్య జరిగినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఘటనలు జరిగిన తొలినాళ్లలోనే ప్రదీప్ శర్మను ఎన్ఐఏ అధికారులు అనుమానించారు. కానీ, అతడు వారిని తప్పుదోవ పట్టించి బయటపడ్డాడు. కానీ, రెండోసారి ఎన్ఐఏ బలమైన సాక్ష్యాలతో ప్రదీప్ను అరెస్టు చేసింది.
ఇప్పుడు కొత్తగా ఎన్ఐఏ ఏం గుర్తించిందంటే..
ఈ కుట్రలో సచిన్ వాజేతోపాటు ప్రదీప్ శర్మ పాత్ర కూడా చాలా లోతుగా ఉందని ఎన్ఐఏ గుర్తించింది. సచిన్ వాజేకు అవసరమైన మనుషులను అతనే సమకూర్చినట్లు తేల్చింది. అంబానీ ఇంటి వద్ద ఉంచిన స్కార్పియో కారు యజమాని మన్సుఖ్ అప్రూవర్గా మారతాడనే అనుమానంతో అంతం చేశారు. మన్సుఖ్ కిడ్నాప్, హత్యకు మనుషులను పురమాయించింది ప్రదీపే అని తేలింది. వీరిలో షెలర్, జాదవ్ అనే ఇద్దరిని జూన్ 11వ తేదీనే అరెస్టు చేశారు. మనీష్ బసంత్, సతీష్ తిరుపతి మోతకూరి అనే వ్యక్తులను నిన్న అరెస్ట్ చేశారు. శర్మను అరెస్టు చేసిన సమయంలో అతడి వద్ద ఒక తుపాకీ, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు. ఆ తుపాకీ లైసెన్స్ తేదీ ముగిసిపోయింది. ఈ కేసులో ప్రదీప్ పాత్రను వెల్లడించేలా డిజిటల్, డాక్యుమెంట్స్ సాక్ష్యాలను ఎన్ఐఏ సేకరించింది.
మన్సుఖ్ను నమ్మించి కిడ్నాప్ చేసి..
ఫిబ్రవరి 26వ తేదీన అంబానీ ఇంటి వద్ద కారు బాంబును స్వాధీనం చేసుకొన్న అనంతరం మన్సుఖ్ హిరేన్ బాగా భయపడిపోయాడు. అక్కడ ఉంచిన కారు తనది కావడంతో అరెస్టు చేస్తారనుకున్నాడు. అదే సమయంలో సచిన్ వాజే అతన్ని పోలీసులకు లొంగిపొమ్మని ఒత్తిడి చేశాడు. కానీ, అందుకు మన్సుఖ్ నిరాకరించాడు. దీంతో విషయం బయటకు పొక్కితే ప్రమాదకరమని భావించిన సచిన్వాజే అతడిని అంతం చేయాలనుకున్నాడు. ప్రదీప్ శర్మ సాయంతో అందుకు అవసరమైన మనుషులను సమకూర్చుకొన్నాడు. మార్చి 4వ తేదీన వినాయక్ షిండే అనే మాజీ పోలీస్తో మన్సుఖ్కు ఫోన్ చేయించాడు. షిండే తనను తాను ‘తావ్డే’ అనే పేరుతో పరిచయం చేసుకొని.. మన్సుఖ్ దాక్కోవడానికి సురక్షిత ప్రదేశం చూపిస్తానని నమ్మబలికినట్లు సమాచారం. ఈ క్రమంలో సచిన్ వాజే, మరో పోలీస్ అధికారి సునీల్ మనేలు అతన్ని కారులో ఎక్కించుకొని ఒక లాడ్జ్ దగ్గర 26 నిమిషాలు ఉన్నారు. అనంతరం టవేరాలో సిద్ధంగా ఉన్న ప్రదీప్ మనుషులకు అతన్ని అప్పజెప్పారు. తర్వాత సచిన్ ఏమీ తెలియనట్లు రైల్లో తిరిగి ముంబయి చేరుకొన్నాడు. అనంతరం ఒక బార్పై నకిలీ రైడింగ్ చేశారు. మన్సుఖ్ ఫోన్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకొన్న సునీల్ మనే.. వాటిని విరోర్ వద్ద పారేశాడు. ఆ తర్వాత తుంగరేశ్వర్ వద్ద తన ఫోన్ ఆన్ చేశాడు. ఇదంతా దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికే అని భావిస్తున్నారు. ఇక హంతకులు కారులోనే మన్సుఖ్ను తీవ్రంగా కొట్టారు. అనంతరం నోట్లో గుడ్డలు కుక్కి ముంబ్రా ప్రాంతంలోని సముద్రంలో పడేశారు.
టవేరాలో కీలక డీఎన్ఏ..
మన్సుఖ్ కిడ్నాప్కు వినియోగించినట్లు అనుమానిస్తున్న టవేరా కారులో కీలక డీఎన్ఏను జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. దీనిని పుణెలోని ఫోరెన్సిక్ పరిశోధన శాలకు తరలించింది. వీటి ఫలితాలు రావాల్సి ఉంది. ప్రదీప్ అనుచరుల అరెస్టు సమయంలో భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకొన్నారు. ఇది హంతకులకు చెల్లింపులు చేసిన మొత్తం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
హత్య ముగిశాక ఫోన్లు.. ఆ సిగ్నల్సే కీలక లింక్..!
ప్రదీప్ శర్మ, సచిన్ వాజే ఈ కుట్రలో ఉన్నారనడానికి ఓ వాట్సాప్ కాల్ సిగ్నల్సే కీలక లింక్గా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. దీనిని తొలుత మహారాష్ట్ర ఏటీఎస్ గుర్తించింది. ఈ కేసులో నిందితుడైన సునీల్ మనే నుంచి మన్సుఖ్ హిరేన్కు వాట్సాప్ కాల్స్ వెళ్లాయి. ఆ నంబర్ లొకేషన్ అంధేరీలో ప్రదీప్ ఇంటి వద్ద చివరి సారి చూపించింది. దీంతోపాటు నిందితులు షెలర్, జాదవ్ కూడా ప్రదీప్ పాత్రపై నోరు విప్పడంతో ఎన్ఐఏ అధికారుల అనుమానాలు నిజమయ్యాయి. కిరాయి హంతకులు కూడా మన్సుఖ్ హత్య తర్వాత ప్రదీప్, సచిన్కు ఫోన్లు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
ఈ కేసులో తనను కొందరు పోలీసు అధికారులు కావాలనే ఇరికిస్తున్నారని ప్రదీప్ కోర్టుకు వెల్లడించాడు. తాను సచిన్ వాజేతో టచ్లో లేనని తెలిపారు. ముంబయి పోలీసుల్లో ఒక వర్గం తనకు వ్యతిరేకంగా పనిచేసి ఈ కేసులో ఇరికిస్తోందని న్యాయస్థానానికి వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. -
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
లోక్సభ ఎన్నికల తొలి దశకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 సీట్లకు శుక్రవారం (ఏప్రిల్ 19న) పోలింగ్ నిర్వహించనున్నారు. -
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
ద్రవిడనాట పట్టు బిగించాలనే సంకల్పంతో ఉన్న ప్రధాని మోదీ.. ఆ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విస్తృత పర్యటన చేశారు. -
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు
Dubai Rains: దుబాయ్లో చిక్కుకున్న భారతీయుల కోసం అక్కడి మన దౌత్య కార్యాలయం హెల్ప్లైన్ నంబర్లు విడుదల చేసింది. -
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
ఒక పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నట్టుగా ఇటీవల బాలీవుడ్ నటుడు ఆమిర్ఖాన్ వీడియో వైరల్ కాగా, తాజాగా రణ్వీర్సింగ్కు అదే పరిస్థితి ఎదురైంది. -
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
మహిళా రెజ్లర్లు తనపై చేస్తున్న లైంగిక ఆరోపణల కేసులో మరింత విచారణ జరపాలని కోరుతూ బ్రిజ్ భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనేపథ్యంలోనే న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. -
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ నౌకా సిబ్బందిలో కేరళ మహిళను విడుదల చేశారు. దీంతో ఆమె నేడు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. -
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
రామేశ్వరం కెఫే బ్లాస్ట్ కేసులో నిందితుల నుంచి కీలక వివరాలు బయటపడుతున్నాయి. వారు ఈ దాడి కుట్రకు వాడేసిన పాత ఫోన్లనే వినియోగించినట్లు తేలింది. -
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
అంతరిక్షం కూడా భవిష్యత్ యుద్ధాలకు వేదికగా మారిందని భారత త్రివిధ దళాల అధిపతి (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. -
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
Arvind Kejriwal: బెయిల్ కోసం దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించింది. షుగర్ పెంచుకునేందుకు స్వీట్లు, మామిడి పండ్లను తింటున్నారని కోర్టుకు తెలిపింది. -
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
అమేఠీ నుంచి రాహుల్ గాంధీ పోటీపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. -
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియాశ్రీనేత్
కాంగ్రెస్ (Congress) నేత సుప్రియా శ్రీనేత్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై భాజపా (BJP) మండిపడింది. -
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
Supreme Court: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. -
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?