ఎగ్జిట్ పోల్: ఐదు రాష్ట్రాల్లో గెలుపెవరిది..?
ఐదు రాష్ట్రాల్లో గెలుపెవరిదనే విషయంపై పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ అంచనాలు ఈ విధంగా ఉన్నాయి.
సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం ప్రశాంతంగా ముగిసింది. పశ్చిమ బెంగాల్(294), తమిళనాడు(234), అస్సాం(126), కేరళ(140), పుదుచ్చేరి(30) రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యం ప్రస్తుతం ఈవీఎంలలో నిక్షిప్తమయ్యింది. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో గెలుపెవరిదనే విషయంపై పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ అంచనాలు ఈ విధంగా ఉన్నాయి.
స్టాలిన్కే తమిళనాడు పగ్గాలు..?
హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు డీఎంకే అధినేత స్టాలిన్ వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. తాజాగా ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలన్ని స్టాలిన్కే అత్యధిక ఆధిక్యం రానున్నట్లు ప్రకటించాయి. రిపబ్లిక్ సీఎన్ఎక్స్ సర్వేలో 160నుంచి 170 స్థానాల్లో డీఎంకే గెలుపొందే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. ఇక అధికారంలో ఉన్న ఏఐఏ డీఎంకేకు కేవలం 58-68 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇక మరోసంస్థ పీమార్క్ చేసిన సర్వేలోనూ స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి 165-190 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఇక పళనిస్వామి పార్టీ మాత్రం 40 నుంచి 65 స్థానాల్లోనే గెలుపొందే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఏబీపీ సీఓటర్ సర్వే కూడా డీఎంకే 160-172 స్థానాల్లో గెలుస్తుందని లెక్కగట్టింది. ఇలా దాదాపు అన్ని సర్వేలు స్టాలిన్ భారీ ఆధిక్యంతో గెలుపొందుతారని అంచనా వేశాయి. ఇక టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే కేవలం రెండు నుంచి నాలుగు స్థానాల్లో గెలుపొందే అవాకాశాలు ఉన్నట్లు ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనా వేశాయి.
ఇదిలాఉంటే, తమిళనాడులో రాజకీయ దిగ్గజాలు జయలలిత, కరుణానిధి లేకుండా జరిగిన తొలి ఎన్నికల సంగ్రామం ఇదే కావడంతో అక్కడి రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి. ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే కూటములతో పాటు కొత్త పార్టీలు ప్రభావం ఏవిధంగా ఉంటాయోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే, మూడోసారి అధికారంలోకి రావాలనుకున్న అన్నాడీఎంకే ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. ఇక రెండు పర్యాయాలు ప్రతిపక్షంలో కూర్చున్న డీఎంకే మాత్రం ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు సిద్దమైనట్లు తాజా సర్వేల ప్రకారం తెలుస్తోంది. ప్రస్తుతం డీఎంకే అధినేత స్టాలిన్ కొళత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీలో దిగారు. ఈ స్థానం నుంచి ఇప్పటికే రెండుసార్లు గెలిచిన స్టాలిన్, హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు ఉన్నాయి.
హ్యాట్రిక్ కొట్టనున్న దీదీ..?
గతంలో ఎన్నడూ చూడనివిధంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల తీవ్ర ఉత్కంఠగా సాగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్రంలో ఎలాగైనా అధికారం చేపట్టాలని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రయత్నించింది. దీంతో తృణమూల్ కాంగ్రెస్, భాజపా మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చివరకు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీనే గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీంతో మమతా బెనర్జీ హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉందని వెల్లడించాయి. అయితే, రెండు పార్టీల మధ్య స్వల్ప తేడానే ఉండనున్నట్లు లెక్కగట్టాయి. గతంలో లేని విధంగా భాజపా భారీ ఓట్ల శాతాన్ని కౌవసం చేసుకోనున్నట్లు పేర్కొన్నాయి. టైమ్స్నౌ జరిపిన సర్వేలో టీఎంసీకి 158 స్థానాలు, భాజపాకు 115 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. రిపబ్లిక్ సీఎన్ఎక్స్ జరిపిన సర్వేలో టీఎంసీ 128 నుంచి 138 స్థానాల్లో గెలుస్తుందని పేర్కొంది. ఇక భాజపా 128 నుంచి 138 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. ఇక పీమార్క్ సర్వే ప్రకారం, తృణమూల్-158, భాజపా-120, వామపక్షాలు 14 స్థానాల్లో గెలుస్తాయని అంచనా వేసింది. ఈటీజీ రీసెర్చ్ చేసిన సర్వేలోనూ టీఎంసీ 169 స్థానాల్లో, భాజపా 110 స్థానాల్లో గెలుస్తాయని పేర్కొంది. ఇక సీఎన్ఎన్ న్యూస్18 అంచనా ప్రకారం, మమతా బెనర్జీకి 162, భాజపాకు 115 సీట్లు వస్తాయని లెక్కగట్టింది. ఎగ్జిట్ పోల్స్ అన్ని సర్వేల్లోనూ వామపక్షాలకు కేవలం 13 నుంచి 19 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేశాయి.
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం భాజపా, తృణమూల్ మధ్య తీవ్ర పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే, గత ఎన్నికల్లో దాదాపు 200 స్థానాల్లో విజయం సాధించిన తృణమూల్ ఈసారి దాదాపు 30 నుంచి 40 స్థానాల్లో కోల్పోయే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ వామపక్ష కూటమీ మరింత దిగజారిపోనున్నట్లు తెలుస్తోంది. ఇక క్రితం ఎన్నికల్లో కేవలం 34 స్థానాల్లో గెలుపొందిన భారతీయ జనతా పార్టీ ఈపారి భారీగా పుంజుకున్నట్లు అర్థమవుతోంది. మునుపటి కంటే దాదాపు 80 నుంచి 90 స్థానాలు అధికంగా కైవసం చేసుకోనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
పశ్చిమ బెంగాల్..
భాజపా+ | టీఎంసీ+ | ఇతరులు | |
రిపబ్లికన్ సీఎన్ఎక్స్ | 138-148 | 128-138 | 1-10 |
టైమ్స్ ఆఫ్ ఇండియా | 143 | 133 | 16 |
ఏబీపీ సీ ఓటర్ | 109-121 | 152-164 | 14-25 |
జన్కీ బాత్ | 162-185 | 121-104 | 9-3 |
పి-మార్క్ | 112-132 | 152-172 | 10-20 |
టైమ్స్ నౌ సీ ఓటర్ | 115 | 158 | 80 |
అస్సాం
భాజపా+ | కాంగ్రెస్+ | ఇతరులు | |
ఇండియాటుడే | 75-85 | 40-50 | 1-4 |
తమిళనాడు
డీఎంకే+ | అన్నాడీఎంకే+ | ఇతరులు | |
రిపబ్లిక్ సీఎన్ఎక్స్ | 160-180 | 58-68 | 0-10 |
టు డేస్ చాణక్య | 164-186 | 46-68 | 0-6 |
కేరళ
ఎల్డీఎఫ్ | యూడీఎఫ్ | భాజపా | |
టైమ్స్ ఆఫ్ ఇండియా | 76 | 61 | 3 |
ఇండియా టుడే | 104-120 | 20-36 | 0-2 |
పుదుచ్చేరి
భాజపా+ | కాంగ్రెస్+ | ఇతరులు | |
టైమ్స్ ఆఫ్ ఇండియా | 18 | 12 | 0 |
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ