Covaxin: గుడ్న్యూస్.. పిల్లలకు త్వరలో కొవాగ్జిన్ టీకా!
కరోనా బారి నుంచి పిల్లలకు రక్షణ కల్పించేలా కేంద్రం శుభవార్త చెప్పింది. 2-18 ఏళ్ల వారికి కొవాగ్జిన్ టీకా
దిల్లీ: కరోనా బారి నుంచి పిల్లలకు రక్షణ కల్పించేలా కేంద్రం శుభవార్త చెప్పింది. 2-18 ఏళ్ల వారికి కొవాగ్జిన్ టీకా ఇచ్చేందుకు నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు కొవాగ్జిన్కు అత్యవసర అనుమతులు జారీ చేయాలని కేంద్రానికి సిఫార్సులు చేసింది
ప్రముఖ దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ చిన్నారుల కోసం రూపొందించిన కొవాగ్జిన్ టీకాపై ఇటీవల ఆ సంస్థ క్లినికల్ ప్రయోగాలు నిర్వహించిన విషయం తెలిసిందే. 2 నుంచి 18ఏళ్ల వారి కోసం కొవాగ్జిన్ టీకా 2, 3 దశల ప్రయోగాలను గత నెలలో పూర్తి చేసిన భారత్ బయోటెక్.. ఆ నివేదికను భారత ఔషధ నియంత్రణ సంస్థకు(డీసీజీఐ) అందజేసింది. ఈ నివేదికను పరిశీలించిన డీసీజీఐ నిపుణుల కమిటీ.. పిల్లలకు కొవాగ్జిన్ టీకా ఇచ్చేలా అత్యవసర అనుమతులు జారీ చేయాలని సిఫార్సులు చేసింది. దీనికి కేంద్రం ఆమోదముద్ర వేయడమే తరువాయి.
కేంద్రం అనుమతి లభిస్తే భారత్లో పిల్లలకు అందుబాటులో వచ్చే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ ఇదే కానుంది. పిల్లలకు ఇచ్చే కొవాగ్జిన్ టీకా కూడా రెండు డోసుల టీకానే. తొలి డోసు ఇచ్చిన 20 రోజులకు రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది.
ఇదిలా ఉండగా.. గుజరాత్కు చెందిన జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డి టీకాకు కేంద్రం అత్యవసర అనుమతులు మంజూరుచేసిన విషయం తెలిసిందే. ఈ టీకాను 12ఏళ్ల పైబడిన వారందరికీ ఇచ్చేలా అభివృద్ధి చేశారు. అయితే జైకోవ్-డి వ్యాక్సిన్ పంపిణీని సంస్థ ఇంకా ప్రారంభించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్