Vaccine import: అమెరికా వెళ్లనున్న విదేశాంగ మంత్రి!
భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఈనెల 24 నుంచి ఐదురోజుల పాటు అమెరికాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు.
ఐరాస చీఫ్, అమెరికా మంత్రులతో భేటీ
దిల్లీ: భారత్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ డిమాండ్కు సరిపడా డోసులు అందుబాటులోకి రావడం లేదు. వీటిపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం అన్ని వనరులను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్.జయశంకర్ ఈనెల 24 నుంచి ఐదురోజుల పాటు అమెరికాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అమెరికా ప్రభుత్వంతో పాటు వ్యాక్సిన్ కంపెనీలతో ఆయన సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. భారత్లో కొవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతి, వ్యాక్సిన్ల కొరత ఏర్పడిన సమయంలో విదేశాంగ మంత్రి అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
‘భారత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ మే 24-28 రోజుల్లో అమెరికాలో పర్యటిస్తారు. తొలుత ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్తో భేటీ అవుతారు. అనంతరం అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకన్తో చర్చలు జరుపుతారు’ అని భారత విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వీరితో పాటు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను చూసే ఇతర కీలక అధికారులతోనూ జయశంకర్ భేటీ కానున్నారు. ముఖ్యంగా పలు వ్యాక్సిన్ సంస్థలతో పాటు అమెరికా-భారత్ల మధ్య కరోనా మహమ్మారి సంబంధిత సహకారంపై చర్చలు జరపనున్నారు.
ఇక దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత ఏర్పడిన నేపథ్యంలో ఇప్పటికే అమెరికా వ్యాక్సిన్ తయారీ సంస్థలతో భారత్ సంప్రదింపులు జరుపుతోంది. వ్యాక్సిన్ దిగుమతి చేసుకోవడంతో పాటు ఇక్కడే వ్యాక్సిన్ తయారీకి కావాల్సిన వనరులను సమకూరుస్తామని భారత్ ఇదివరకే వెల్లడించింది. అమెరికా పర్యటనలోనూ ఇదే విషయాన్ని ఆయా సంస్థలకు విదేశాంగశాఖ మంత్రి మరోసారి స్పష్టం చేసే అవకాశం ఉంది. వ్యాక్సిన్ల అంశమే అమెరికా పర్యటనలో కీలక అజెండా అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే, భారత్లో ఇప్పటికే మూడు వ్యాక్సిన్లకు అనుమతి లభించింది. కొవాగ్జిన్, కొవిషీల్డ్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ డిమాండ్కు సరిపడా సరఫరా లేదు. ఇక రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ ప్రస్తుతం అక్కడి నుంచే దిగుమతి అవుతోంది. భారత్లో స్పుత్నిక్ ఉత్పత్తి జులై నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ రెడ్డీస్ కంపెనీ ఇదివరకే వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!