Facebook: ఫేస్‌బుక్‌కు షాక్‌.. రూ.515 కోట్ల జరిమానా!

ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌కు బ్రిటన్‌ కాంపీటీషన్‌ రెగ్యులేటర్‌ భారీ జరిమానా విధించింది.

Updated : 21 Oct 2021 10:24 IST

లండన్‌: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌కు బ్రిటన్‌ కాంపీటీషన్‌ రెగ్యులేటర్‌ భారీ జరిమానా విధించింది. తాము అడిగిన వివరాలు సమర్పించడంలో ఫేస్‌బుక్‌ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిందని, అందుకే రూ.515 కోట్ల (50.5 మిలియన్‌ పౌండ్లు) జరిమానాగా చెల్లించాలని ఆదేశించినట్లు తెలిపింది. ఏ కంపెనీ అయినా చట్టానికి లోబడి ఉండాల్సిందేనన్న హెచ్చరిక పంపించాలన్న విధానాల మేరకు ఈ జరిమానా విధించినట్లు పేర్కొంది.

యూనిమేటెడ్‌ సంస్థ జిఫీని గతేడాది ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసింది. అయితే, జిఫీ కొనుగోలు ద్వారా సామాజిక మాధ్యమాల మధ్య పోటీని ఫేస్‌బుక్‌ నియంత్రిస్తోందన్న ఆరోపణలపై బ్రిటన్‌ కాంపీటీషన్‌ అండ్‌ మార్కెట్స్‌ అథారిటీ (సీఎంఏ) విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో వివరాలు ఇవ్వాలని పలుమార్లు కోరినప్పటికీ వాటిని సమర్పించడంలో ఫేస్‌బుక్‌ ఉద్దేశపూర్వకంగానే వెనుకడుగు వేసిందని సీఎంఏ పేర్కొంది. మరోవైపు సీఎంఏ నిర్ణయంపై ఫేస్‌బుక్‌ స్పందించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది. సీఎంఏ నిర్ణయంపై సమీక్షించి తదుపరి అవకాశాలను పరిశీలిస్తామని తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని