Facebook: ఆ నకిలీ పోస్టు వెనుక చైనా హస్తం.. 500కిపైగా ఖాతాలు తొలగింపు!
కరోనా వైరస్ మూలాల ఆన్వేషణలో అమెరికా జోక్యం చేసుకుంటోందని, చైనాపై నింద వేసేలా పావులు కదుపుతోందని స్విట్జర్లాండ్కు చెందిన బయాలజిస్ట్ రాసినట్లు ఉన్న పోస్ట్ కొన్ని నెలల కిందట సోషల్మీడియాలో తెగ వైరల్ అయింది. చైనా మీడియా కూడా దీన్ని ప్రముఖంగా ప్రచురించింది. ఈ నేపథ్యంలో
వాషింగ్టన్: కరోనా వైరస్ మూలాల అన్వేషణలో అమెరికా జోక్యం చేసుకుంటోందని.. చైనాపై నింద మోపేలా పావులు కదుపుతోందని స్విట్జర్లాండ్కు చెందిన బయాలజిస్ట్ రాసినట్లు ఉన్న పోస్ట్ కొన్ని నెలల కిందట సోషల్మీడియాలో వైరల్గా మారింది. చైనా మీడియా కూడా దీన్ని ప్రముఖంగా ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఆ పోస్టుపై ఫేస్బుక్ మాతృసంస్థ మెటా దృష్టిసారించింది. దీని వెనుకున్న అసలు సూత్రదారులు చైనాకి చెందిన వారేనని గుర్తించింది. వారికి సంబంధించిన 500కుపైగా సోషల్మీడియా ఖాతాలను తొలగించింది.
స్విట్జర్లాండ్కు చెందిన జీవశాస్త్రవేత్త విల్సన్ ఎడ్వర్డ్ పేరిట ఉన్న ఫేస్బుక్ ఖాతాలో కరోనా అంశంపై ఓ పోస్టు చేశారు. ‘కరోనా విషయంలో చైనాను నిందించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కొవిడ్-19 వైరస్ మూలాలను అన్వేషిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన శాస్త్రవేత్తలపై అమెరికా ఒత్తిడి తెస్తోంది’అని పోస్టులో పేర్కొన్నారు. గత జులైలో పెట్టిన ఈ పోస్టు వైరల్ కావడంతో.. దీన్ని ఆధారంగా చేసుకొని చైనాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థలు కూడా కథనాలు రాసుకొచ్చాయి. కాగా.. విల్సన్ ఎడ్వర్డ్ అనే పేరుతో స్విట్జర్లాండ్లో జీవశాస్త్రవేత్తలు ఎవరూ లేరని, ఆ పేరుతో గతంలోనూ ఎలాంటి అకాడమిక్ కథనాలు వెలువడలేదని స్విస్ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఆ ఫేస్బుక్ ఖాతాను ఇటీవలే ప్రారంభించారని పేర్కొంది.
ఆ పోస్టుపై విచారణ జరిపిన మెటా సంస్థ.. వాస్తవాలను వెల్లడించింది. అది నకిలీ ఖాతా అని, చైనాకు చెందిన కొందరు ఉద్దేశపూర్వకంగానే ఆ పోస్టును వైరల్ చేశారని తేల్చింది. ఈ కుట్రలో ‘సిచూవాన్ సైలెన్స్’ అనే ఐటీ కంపెనీ ఉద్యోగులతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా చైనాకు చెందిన మౌలిక సదుపాయాల సంస్థలతో సంబంధాలున్న మరికొందరు ఉన్నట్లు మెటా పేర్కొంది. సిచూవాన్ సంస్థ చైనా ప్రజాభద్రతకు, నేషనల్ కంప్యూటర్ నెట్వర్క్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్కు, సైబర్ సెక్యూరిటీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్కు సాంకేతిక సహకారం అందిస్తుండటం గమనార్హం.
విల్సన్ ఎడ్వర్డ్ పేరిట ఉన్న నకిలీ ఖాతా పోస్టును మొదట కొన్ని నకిలీ ఖాతాల ద్వారా షేర్ చేశారని, ఆ తర్వాత గుర్తింపు ఉన్న ఖాతాలతో వైరల్ చేశారని మెటా సంస్థ వెల్లడించింది. ఈ పనిచేసిన వారు ఐపీ అడ్రెస్ను గుర్తించకుండా వీపీఎన్ను ఉపయోగించినట్లు తెలిపింది. విల్సన్ ఎడ్వర్డ్ ప్రొఫైల్ ఫొటోని కూడా మెషిన్-లెర్నింగ్ను ఉపయోగించి తయారు చేసినట్లు మెటా భావిస్తోంది. ఈ నకిలీ పోస్టు వైరల్ అవడానికి కారణమైన మొత్తం 524 ఫేస్బుక్ ఖాతాలను, 20 పేజీలను, నాలుగు గ్రూపులను, 86 ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తొలగించినట్లు మెటా సంస్థ వెల్లడించింది.
కరోనా మూలాలు చైనాలోనే ఉన్నాయని అమెరికా మొదటి నుంచి విమర్శలు చేస్తోంది. దీంతో చైనా, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.