
Corona Manmade: వెనక్కి తగ్గిన ఫేస్బుక్!
అలాంటి పోస్టులు తొలగించబోమని వెల్లడి
వాషింగ్టన్: ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్ మహమ్మారి వెలుగు చూసి ఏడాదిన్నర కావస్తున్నా.. వాటి మూలాలపై మాత్రం ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వుహాన్లోని ల్యాబ్నుంచి వైరస్ విడుదల అయ్యిందంటూ వస్తోన్న కథనాలపై సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అవి అసత్య ప్రచారాలని పేర్కొంటూ.. ఎవరైనా వాటిని పోస్టు చేస్తే తొలగించే ప్రక్రియను కొనసాగిస్తోంది. ఈ అంశంపై తాజాగా వెనక్కి తగ్గిన ఫేస్బుక్.. ఇకపై అలాంటి సమాచారాన్ని తొలగించబోమని వెల్లడించింది. వైరస్ మూలాలపై సమగ్ర విచారణ జరపాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారులను ఆదేశించడంతో పాటు వైరస్ను ‘మ్యాన్మేడ్’ అంటూ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తోన్న తరుణంలో ఫేస్బుక్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
‘కరోనా వైరస్ మూలాలపై దర్యాప్తు జరుగుతోన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని.. ప్రజారోగ్య నిపుణులతో చర్చించిన అనంతరం మా విధానాన్ని మార్చుకున్నాం. కొవిడ్-19 మానవ సృష్టి అంటూ వచ్చే వార్తలను మా యాప్ల నుంచి తొలగించబోం’ అని ఓ అమెరికా వార్త పత్రికకు ఫేస్బుక్ అధికార ప్రతినిధి వెల్లడించారు. కరోనా మహమ్మారిపై వచ్చే వాస్తవాలు, నూతన సమాచారానికి అనుగుణంగా తమ విధానాలను ఎప్పటికప్పుడు నవీకరిస్తామన్నారు. ఇందుకోసం ఆరోగ్య నిపుణులతో కలిసి పని చేస్తూనే ఉన్నామని స్పష్టం చేశారు.
కొవిడ్ మూలాలపై నిగ్గు తేల్చండి: జో బైడెన్
కొవిడ్ మహమ్మారి మూలాలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు దర్యాప్తును వేగవంతం చేయాలని అమెరికా నిఘా సంస్థలను అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకిందా లేదా ప్రయోగశాల నుంచి ప్రమాదవశాత్తు బయటపడి ప్రపంచాన్ని చుట్టుముట్టిందా అనే అంశంలో అంతిమ నిర్ణయానికి వచ్చేందుకు ప్రస్తుతం ఉన్న ఆధారాలు సరిపోవడంలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో వైరస్ మూలాలను కనుక్కునేందుకు అంతర్జాతీయ సమాజం నిర్వహించే పరిశోధనలో చైనా పాల్గొనడంతో పాటు పూర్తిస్థాయిలో సహకరించాలని, సమాచారాన్ని అందించడంలోనూ పారదర్శకంగా వ్యవహరించాలని అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే, ప్రపంచ విలయానికి కారణమైన కరోనా వైరస్ జంతువుల నుంచి మానవులకు సోకిందని ఇంకా నిరూపణ కాలేదు. ఈ నేపథ్యంలో వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్నుంచే వచ్చిందని ఎఫ్డీఏ మాజీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు మద్దతు పెరుగుతోందని అమెరికా మీడియా గుర్తుచేసింది. ఇక కరోనా మూలాలకు చైనానే కారణమంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు అప్పటి విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా ఆరోపణలు చేశారు. ఈ మహమ్మారికి చైనానే జవాబుదారీ వహించాలని పదేపదే పేర్కొన్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Australia Floods: సిడ్నీకి జల గండం..!
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Business News
Airtel prepaid plans: ఎయిర్టెల్లో మరో 4 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
-
Politics News
Bandi Sanjay: శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాన్ని మోదీ నెరవేర్చారు: బండి సంజయ్
-
Sports News
IND vs ENG: 18నెలల కిందట చూసిన బౌలర్లా లేడు.. టీమ్ ఇండియాకు పెద్ద షాక్: మాజీ క్రికెటర్లు
-
India News
Mahua Moitra: టీఎంసీకి మహువా మొయిత్రా గుడ్బై..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్పై శోభు యార్లగడ్డ ఫైర్
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- Abdul kalam: కలాం అలా కళ్లెం వేశారు!.. ముషారఫ్ను నిలువరించిన వేళ..
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు