మిడతలతో లాభం పొందుతున్న కెన్యా రైతులు!
ఇంటర్నెట్ డెస్క్: మిడతలతో రైతులకు నష్టాలే గానీ.. లాభం ఎలా ఉంటుందని అనుకుంటున్నారా?నిజమేనండి.. మిడతలు పంటలపై దాడి చేసి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుంటాయి. గతేడాది మన ఉత్తరభారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో మిడతల దండు దాడి చేసి పంటలను నాశనం చేశాయి. చేతికొచ్చిన పంటలు మిడతలపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. ఇలాంటి ఘటనలు కెన్యా దేశంలో తరచూ జరుగుతూనే ఉంటాయి. సీజనల్గా మిడతలు పంటలపై దాడి చేస్తుంటాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతుంటారు. అయితే, ఎక్కడ పోగొట్టుకుంటున్నామో.. అక్కడే వెతుక్కోవాలి అన్నట్లుగా.. మిడతల కారణంగా నష్టపోయిన కెన్యా రైతులు.. ఆ మిడతల ద్వారానే లాభం పొందుతున్నారు. ఎలా అంటారా..!
మిడతల్ని దాణా.. ఎరువుగా మార్చి
మిడతల్లో ప్రోటీన్లు.. ఇనుము, జింక్, మెగ్నీషియమ్ వంటి ఖనిజాలు మెండుగా ఉంటాయి. కాబట్టి వీటిని జంతువులకు దాణాగా వేయొచ్చు. అలాగే సేంద్రియ ఎరువుగాను ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతారు. దీనిపై బాగా అధ్యయనం చేసిన లారా స్టాన్ఫోర్డ్ అనే వ్యక్తి ‘ది బగ్ పిక్చర్’ పేరుతో స్టార్టప్ను ప్రారంభించారు. ఈ సంస్థ.. పంటలను నాశనం చేస్తున్న మిడతల్ని సేకరించి వాటిని పౌడర్గా మార్చి దాణా.. ఎరువుల రూపంలో విక్రయిస్తుంటుంది. మిడతలకు ఆహారపరంగా.. సంతానోత్పత్తికి కెన్యాలో అనువైన వాతావరణం ఉంటుంది. అక్కడి సముద్రం నుంచి వీచే వేడి గాలుల ద్వారా కురిసే వర్షం నిద్రాణస్థితిలో ఉండే మిడతల గుడ్లను మేల్కోపుతుంది. అక్కడి తుపానులను మిడతల సమూహం ధీటుగా ఎదుర్కొనగలవు. అందుకే కెన్యాకు మిడతల గుంపు తరచూ వస్తుంటాయి. ముఖ్యంగా లైకిపీయా, ఇసియొలో, సంబూరి, సెంట్రల్ కెన్యా ప్రాంతాల్లో మిడతల సమస్య ఎక్కువగా ఉంటుంది.
రైతులతో ఒప్పందాలు
ఈ నేపథ్యంలో బగ్ పిక్చర్ సంస్థ మిడతల సమస్య ఎక్కువున్న ప్రాంతాల్లోని రైతులతో ఒప్పందాలు చేసుకుంటోంది. రైతులు పంటలకు బదులు.. మిడతల్నే పెంచాలని కోరుతోంది. అలా రైతులు పెంచిన మిడతల్ని కిలో 50 కెన్యన్ షిల్లింగ్స్ చొప్పున బగ్ పిక్చర్ సంస్థే కొనుగోలు చేస్తుంది. వాటిని మిల్లుల్లో అధిక ప్రోటీన్లు ఉన్న జంతువుల దాణా, ఎరువుగా మార్చుతోంది. మిడతల వల్ల పంట నష్టాలను చవిచూసిన రైతులు.. ఇప్పుడు మిడతల్నే పంటగా మార్చుకొని ఆదాయం పొందేలా మా వంతు ప్రయత్నం చేస్తున్నామని లారా స్టాన్ఫొర్డ్ వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Liger: షారుఖ్ సూపర్హిట్ని గుర్తు చేసిన ‘లైగర్’ జోడీ..!
-
General News
Monkey pox: మంకీపాక్స్ ప్రమాదకరం కాదు కానీ... ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
Politics News
Eknath Shinde : శివసేన కోసం కొత్త భవనం నిర్మించనున్న శిందే వర్గం..?
-
India News
ఇదొక ‘లంచం.. మంచం ప్రభుత్వం’.. కర్ణాటక మాజీ మంత్రి వ్యాఖ్యలపై దుమారం!
-
Politics News
Telangana News: అక్కడెందుకు సీఎం కేసీఆర్ పర్యటించలేదు?: కోదండరామ్
-
India News
Modi: మిమ్మల్ని కలుసుకోవాలని అప్పుడే అనుకున్నాను..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్లో మూడు సంచలన క్యాచ్లు!
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్వీర్సింగ్ ఇంటికి పోలీసులు!
- F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు
- Naga Chaitanya: సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వచ్చేశారు.. బాధేసింది: నాగచైతన్య