రైతుల ప్రయోజనం కోసమే సంస్కరణలు! మోదీ

వ్యవసాయ రంగంలో కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా 86శాతం రైతులకు లబ్ధి చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి స్పష్టంచేశారు.

Published : 26 Sep 2020 01:08 IST

దిల్లీ: వ్యవసాయ రంగంలో కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి స్పష్టంచేశారు. ముఖ్యంగా, 86శాతం ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతుల, కార్మికుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వాలు, వారి వాగ్దానాలను గాలికి వదిలేశాయని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి రైతులకు, కులీలకు అబద్దాలు చెబుతూనే ఉన్నారని.. తాజా సంస్కరణలపై ఇప్పుడు కూడా రైతులను కొందరు తప్పుదోవపట్టిస్తున్నారని విమర్శించారు. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పంటలకు కనీస మద్దతు ధర పెంచడంలో రికార్డు సృష్టించామని అన్నారు. భాజపా నాయకులతో జరిగిన వర్చువల్‌ సమావేశంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతేకాకుండా, తాజాగా తీసుకొచ్చిన కార్మిక చట్టాల వల్ల దాదాపు 50కోట్ల మంది సంఘటిత, అసంఘటిత కార్మికులకు సరైన సమయంలో వేతనాలు అందుతాయన్నారు. ఇప్పటివరకు కేవలం 30శాతం మంది కార్మికులు మాత్రమే కనీస వేతనాలు పొందేవారని.. ప్రస్తుతం అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులందరికీ ప్రయోజనాలు వర్తిస్తాయన్నారు. వ్యవసాయంలో ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను, వాటి ప్రయోజనాల గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా భాజపా కార్యకర్తలకు ప్రధాని మోదీ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని