
Rakesh Tikait: ‘కేంద్రం మోసం చేసింది’.. దేశవ్యాప్త నిరసనలకు రైతు సంఘాల పిలుపు
దిల్లీ: రైతు సంఘాల నాయకులు మరోసారి నిరసనలకు పిలుపునిచ్చారు. గతేడాది వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా రైతు సమస్యలపై జారీ చేసిన లేఖలోని ఏ హామీని ఇంతవరకూ అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ ఆదివారం ఆరోపించారు. ఇందుకు నిరసనగా సోమవారం సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం), బీకేయూ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ‘ద్రోహ దినం’ పేరిట ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. డిసెంబరు 9న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకే దిల్లీ సరిహద్దుల్లో ఏడాది కాలంగా కొనసాగిన నిరసనలను ఉపసంహరించుకున్నామని, అయితే వాటిని నెరవేర్చడం లేదని టికాయిత్ విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ట్వీట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ 2020 నవంబర్లో రైతులు ఆందోళనలు ప్రారంభించిన విషయం తెలిసిందే. దిల్లీ సరిహద్దుల్లో ఏడాదికిపైగా నిరసనలు కొనసాగించారు. ఎట్టకేలకు ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు గతేడాది నవంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ క్రమంలోనే నిరసనల సమయంలో రైతులపై నమోదు చేసిన కేసుల ఉపసంహరణ, కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)పై కమిటీ ఏర్పాటుతో పెండింగ్లో ఉన్న డిమాండ్ల పరిష్కారానికి అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం.. ఎస్కేఎం నేతలకు లేఖ పంపింది. దీంతో రైతులు గతేడాది డిసెంబరులో దిల్లీ సరిహద్దులను ఖాళీ చేశారు. కానీ, ఆ హామీలను అమలు చేయడం లేదంటూ తాజాగా మరోసారి నిరసనలకు దిగనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Pant - Dravid : రిషభ్ పంత్ షాట్లు కొడుతుంటే ఒక్కోసారి మా హార్ట్బీట్ పెరుగుతోంది: ద్రవిడ్
-
India News
Lalu Prasad Yadav: కుదుటపడని లాలూ ఆరోగ్యం.. ఎయిమ్స్కు తరలింపు..!
-
Politics News
Chandrababu: అమ్మ ఒడి బూటకం.. ఇంగ్లిష్ మీడియం ఒక నాటకం: చంద్రబాబు
-
World News
China: చైనాకు కరోనా తిప్పలు.. మరోసారి వైరస్ విజృంభణ..!
-
Politics News
LPG Hike: ‘మహా’ ఖర్చులను పూడ్చుకునేందుకే గ్యాస్ ధరను పెంచారా?
-
Sports News
IND vs ENG : ఇంగ్లాండ్ వేదికగా.. పొట్టి కప్ కోసం సమర శంఖం పూరించేనా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Online Food delivery: ఆన్లైన్ Vs ఆఫ్లైన్: ఫుడ్ డెలివరీ దోపిడీని బయటపెట్టిన యూజర్.. పోస్ట్ వైరల్!
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్పై శోభు యార్లగడ్డ ఫైర్
- Bhagwant Mann: రెండో వివాహం చేసుకోబోతోన్న సీఎం భగవంత్ మాన్!
- Health : పొంచి ఉన్న ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు!
- Paid trip to employees: ఉద్యోగులందరికీ 2 వారాల ట్రిప్.. ఖర్చులన్నీ కంపెనీవే!
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?