Afghanistan: నాకు భయంగా ఉంది.. ఎక్కడ చూసినా వారే కనిపిస్తున్నారు!
అఫ్గాన్ను ఆక్రమించుకున్నాక తాలిబన్లు మహిళలపై దాష్టీకాన్ని ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. వారి హక్కుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలోనూ వారికి స్థానం కల్పించలేదు. ఈ విషయంలో నిరసన తెలుపుతున్నవారిని నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నారు...
కాబుల్: అఫ్గాన్ను ఆక్రమించుకున్నాక తాలిబన్లు మహిళలపై దాష్టీకాన్ని ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. వారి హక్కుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలోనూ వారికి స్థానం కల్పించలేదు. ఈ విషయంలో నిరసన తెలుపుతున్నవారిని నిర్దాక్షిణ్యంగా అణచి వేస్తున్నారు. మరోవైపు.. దేశవ్యాప్తంగా ఆయా జైళ్లలో బందీలుగా ఉన్న వేలాది నేరస్థులను, తీవ్రవాదులను, తాలిబన్లను విడుదల చేస్తున్నారు. దీంతో వారికి శిక్షలు వేసిన జడ్జిలకు ప్రాణభయం పట్టుకుంది. ఎక్కడ చంపేస్తారోనని దేశవ్యాప్తంగా వందలాది న్యాయమూర్తులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారిలో దాదాపు 200కు పైగా మహిళా న్యాయమూర్తులు ఉన్నట్లు బ్రిటన్కు చెందిన ‘ది ఇండిపెంటెండ్’ తన నివేదికలో వెల్లడించింది.
మా ఇంటికి వచ్చి.. నా గురించి ఆరా తీశారు
నంగర్హర్ ప్రావిన్స్కు చెందిన 38 ఏళ్ల మహిళా న్యాయమూర్తి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఆమె భయాందోళనను సదరు నివేదికలో ఉటంకించారు. ‘భార్యను హింసించినందుకుగానూ ఎనిమిది నెలల క్రితం ఒక తాలిబన్కు శిక్ష విధించాను. జైలు నుంచి విడుదలయ్యాక నిన్నూ అలాగే హింసిస్తానని విచారణ ముగింపు సమయంలో అతను నన్ను బెదిరించాడు. అప్పుడు అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ.. ఇప్పుడు అతను విడుదలయ్యాడు. నా ఆచూకీకి యత్నిస్తున్నాడు. వ్యక్తిగత వివరాలూ సేకరించాడు. చాలా సార్లు ఫోన్ చేశాడు. నేను మా ఇంటిని విడిచిపెట్టాక.. కొంతమంది తాలిబన్లు అక్కడికి వచ్చి, నా గురించి ఆరా తీశారు. ఒకవేళ వారు నన్ను పట్టుకుంటే చంపేయ్యొచ్చు. నాకు భయంగా ఉంది. ఎక్కడ చూసినా వారే కనిపిస్తున్నారు. ఇక్కడి 200కు పైగా మహిళ జడ్జిలదీ ఇదే దుస్థితి. మా ఉద్యోగాలు, ఆస్తులు పోయినా.. ఫర్వాలేదు. కానీ.. మా ప్రాణాలు, మా పిల్లల ప్రాణాలు ముఖ్యం. ఇప్పుడు ఏదైనా జరగొచ్చు. తాలిబన్లు పట్టుకుని, చంపేసేలోపే అంతర్జాతీయ సమాజం మమ్మల్ని ఆదుకోవాల’ని ఆమె విజ్ఞప్తి చేశారు.
వారికి ఇప్పుడు ఇద్దరు శత్రువులు..
మహిళా న్యాయమూర్తులకు తాలిబన్లు, నేరస్థుల నుంచి హత్యా బెదిరింపులు వస్తున్నాయని అఫ్గాన్లోని ఫ్యామిలీ కోర్టు మాజీ జడ్జి మర్జియా బాబాకర్ఖైల్ పేర్కొన్నారు. ‘నా విషయమై నా సోదరుడిని తాలిబన్లు దారుణంగా కొట్టార’ని ఓ మహిళా న్యాయమూర్తి తనతో చెప్పి వాపోయినట్లు ఆమె తెలిపారు. ‘ప్రస్తుతం మహిళా జడ్జిలకు ఇద్దరు శత్రువులు. ఒకరు తాలిబన్లు కాగ, మరొకరు నేరస్థులు. సదరు నేరస్థుల్లో ఉగ్రవాదులు, మాదకద్రవ్యాల రవాణాకు పాల్పడినవారూ ఉన్నార’ని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం లండన్లో నివశిస్తున్న మర్జియా.. అఫ్గాన్ మహిళా జడ్జీలను రక్షించేందుకు ప్రచారం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి